బచ్చన్నపేట, మార్చి 22 : రెవెన్యూ అధికారుల వేధింపులు భరించలేక ఓ రైతు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం మండలంలోని పడమటికేశ్వాపూర్లో చోటుచేసు కుంది. రైతు మృతదేహంతో బంధువులు, గ్రామస్తులు బచ్చన్నపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొమ్మాట రఘుపతి (45)కి కొన్నె శివారు పరిధిలో సర్వే నంబర్ 75,76లో ఉన్న 1.30 ఎకరాల భూమి రికార్డుకు రావడం లేదని సీనియర్ అసిస్టెంట్ సుమన్, సర్వేయర్ రవీందర్ను కలిశాడు. రికార్డుకు ఎక్కించాలని కోరగా వారు రూ. 6 లక్షలు లంచం డిమాండ్ చేయగా, చివర కు రూ. 4.50 లక్షలకు ఒప్పుకున్నారు. ఒకసారి రూ. 2 లక్షలు, మరోసారి రూ. 2.50 లక్షలు సర్వేయర్కు ఇచ్చా డు. రెండేండ్లుగా భూమి రికార్డులకు ఎక్కకపోవడంతో రఘుపతి నిలదీయగా ఆ భూమి కోర్టు పరిధిలో, ఇతరుల పేరున ఉండడంతో వీలు కాదని చెప్పారు.
దీంతో రఘుపతి తన డబ్బులు తనకు ఇవ్వాలని ఎన్ని సార్లు తిరిగినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో రఘుపతి పెద్ద కుమార్తె వి వాహం చేయడంతో అప్పులు మరింత ఎక్కువయ్యాయి. ఇటు డబ్బులు రాక, అటు భూమి రికార్డుల్లో ఎక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని బలవన్మ రణానికి పాల్పడ్డాడు. మృతుడికి భార్య శ్యామల, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకుని తిరిగి అడిగితే ఇవ్వకుండా వేధింపులకు పాల్పడడంతోనే రఘు పతి మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు మృతదేహంతో బచ్చన్నపేట తహసీల్ ఎదుట ధర్నా చేపట్టారు. రైతు కు టుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని తహసీల్దార్ విశాలాక్షి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని, ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై సతీశ్, సీపీఎం నాయకులు వెంకటేశ్, విజేందర్, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.