చిల్పూరు, మార్చి 23 : బుగులు వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మండల కేంద్రంలోని స్వామివారి ఆలయంలో వైభవంగా జరుగుతున్నా యి. వేడుకల్ల్లో భాగంగా శనివారం ఉదయం హో మం, బలిహరణం నిర్వహించారు. సాయంత్రం అర్చకులు ఉత్సవమూర్తులను అలంకరించి రథంపై ప్రతిష్ఠించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలతో భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ వీధుల్లో ఊరేగించారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ మామిడాల యాదవరెడ్డి, ఎస్సై ముత్యం రాజేందర్, కాంగ్రెస్ మండల ఇన్చార్జి తీగల మహేందర్, నాయకులు సునీల్, మూల నాగరాజు, పంతం రాజు, ఉత్సవ కమిటీ సభ్యులు సంగోజు మోహనాచారి, పెద్ది నారాయణ, పుల్యాల నారాయణరెడ్డి, జక్కుల రాజశేఖర్, కనకం మధు, గాజుల రజిని, బీ బాలరాజు, పీ కిరణ్రెడ్డి, మేకల మల్లేశం, ఎల్లయ్య, ఎ సత్యనారాయణ, బీ వికాస్రెడ్డి, ఉప్పరి గణేశ్, అర్చకులు రవీందర్శర్మ, రంగాచార్యులు, కృష్ణమాచార్యులు, సిబ్బంది రమేశ్, వీరన్న, శేఖర్, విశాల్, కృష్ణ, మహేశ్ పాల్గొన్నారు.