హనుమకొండ చౌరస్తా, మే 22: వరంగల్లో ప్రెస్క్లబ్ ఏర్పాటుకు సహకరిస్తామని గ్రేటర్ వరంగల్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు అన్నారు. వరంగల్ నగరంలో నూతన ప్రెస్క్లబ్ ఏర్పాటు కోసం ఏర్పడ్డ అడ్హక్ కమిటీ సభ్యులు గ్రేటర్ వరంగల్ ప్రెస్క్లబ్ అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారితో సమావేశమయ్యారు. వరంగల్లో ప్రెస్క్లబ్ఏర్పాటు చేయటానికి పూనుకున్నామని, మాకు గ్రేటర్ వరంగల్ ప్రెస్క్లబ్ నుంచి సహాయ, సహకారాలు అందించాలని ఈ సందర్భంగా వారు విన్నవించారు. అన్ని విషయాలను సావధానంగా చర్చించారు.
నూతన క్లబ్కు ఏ రకమైన సహకారం అందించాలో తెలియజేయాలని అడ్హక్ కమిటీ బాధ్యులను కోరగా అందరు బాధ్యులతో చర్చించి మళ్లీ తెలియజేస్తామన్నారు. వరంగల్ అడ్హక్ బాధ్యులు తమ అభిప్రాయాలను తెలియజేసిన తర్వాత తాము యూనియన్ల నేతలు, తమ కమిటీతో చర్చించిన అనంతరం తుదినిర్ణయాన్ని ప్రకటిస్తామని అధ్యక్షుడు వేముల నాగరాజుకి తెలియజేశారు. సమావేశంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బోళ్ల అమర్, అడ్హక్ కమిటీ ప్రతినిధులు సంగోజు రవి, కోరుకొప్పుల నరేందర్, మట్ట దుర్గాప్రసాద్, జన్ను స్వామి, జక్కుల విజయ్కుమార్, వలిశెట్టి సుధాకర్, బాలవారి విజయ్రాజ్ పాల్గొన్నారు.