పోచమ్మమైదాన్, జూలై 14 : జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చిత్రపటాలకు ఎనుమాముల బాలాజీనగర్లో గురువారం క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు వేముల భూపాల్ మాట్లాడుతూ.. వాహన ఫిట్నెస్ ట్యాక్స్పై రోజుకు రూ.50 ఆలస్య రుసుం నుంచి మినహాయింపు ఇవ్వడం వల్ల లారీ యాజమానులకు ఊరట లభించిందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ అఫ్జల్ మియా, వైస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, జాయింట్ సెక్రటరీ జాకీర్ తదితరులు పాల్గొన్నారు.