హసన్పర్తి, సెప్టెంబర్ 5 : సమాజంలో గురువుల పాత్ర ఉన్నతమైనదని, తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు జీవితాన్నిస్తారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమారంలోని జడ్పీ పాఠశాలలో సోమవారం గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రమేశ్ హాజరై సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 20 ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గురువులతో ప్రతి విద్యార్థి అంకిత భావంతో ఉండాలన్నారు. చదువు చేప్పేవాళ్లు మాత్రమే కాదని, సన్మార్గంలో నడిపించే ప్రతి ఒక్కరూ గురువులేనని అన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జక్కుల రజితావెంకటేశ్వర్లు, డివిజన్ అధ్యక్షుడు అటికం రవీందర్. ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మణ్, ఉపాధ్యాయుడు దోమకుమార్, నాయకులు విక్టర్బాబు, సురేశ్ పాల్గొన్నారు.
వరద బాధితులను సరుకుల కిట్ల పంపిణీ
అమేజాన్ సహకారంతో బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో గ్రేటర్ ఒకటో డివిజన్ పలివేల్పులకు చెందిన 250 మంది వరద బాధితులకు నిత్యావసరాల కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే రమేశ్, బాలవికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డి ముఖ్యఅతిథిలుగా హాజరై బాధితులకు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ పేద ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. విద్య, వైద్యానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారన్నారు. వరంగల్లో రూ.1100కోట్లతో సూపర్స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నట్లు చెప్పారు. అలాగే, అరూరి గట్టుమట్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నరెడ్ల శ్రీధర్, ఆత్మ డైరెక్టర్, మార్కెట్ డైరెక్టర్ గనిపాక కల్పనావిజయ్, నాయకులు చల్లా వెంకటేశ్వర్రెడ్డి, పోతరబోయిన లోకేశ్యాదవ్, డివిజన్ ఎస్సీసెల్ అధ్యక్షుడు అలువాల రంజిత్ పాల్గొన్నారు.