మడికొండ, మే 23: రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 44, 45వ డివిజన్ల పరిధిలోని కడిపికొండ, కుమ్మరిగూడెం, రాంపేట గ్రామాలకు చెందిన ఆరుగురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెకులను మంగళవారం ఆయన స్వయంగా ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు, దర్గా సొసైటీ చైర్మన్ ఊకంటి వనంరెడ్డి, మాజీ కార్పొరేటర్ బస్కె శ్రీలేఖ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సురేందర్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు రమేశ్, నాయకులు బొమ్మినేని రాంచంద్రారెడ్డి, జైపాల్రెడ్డి, కర్ర హరీశ్రెడ్డి పాల్గొన్నారు.
అలాగే, గ్రేటర్ 64వ డివిజన్ మడికొండలోని పోచమ్మగుడి, మడేలయ్య ఆలయాల వద్ద రూ.50 లక్షలతో చేపడుతున్న సీసీరోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు కార్పొరేటర్ ఆవాల రాధికారెడ్డితో కలిసి ఎమ్మెల్యే అరూరి శంకుస్థాపన చేశారు.కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు, నాయకులు పేపర్ రవి, పల్లపు రాజేందర్, రొయ్యల లక్ష్మణ్, ఆకుతోట ప్రశాంత్ పాల్గొన్నారు.