న్యూశాయంపేట, మే 3 : నగరానికి మంత్రి కేటీఆర్ వస్తున్న సందర్భంగా శుక్రవారం నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ పిలుపునిచ్చారు. బుధవారం హంటర్రోడ్డులోని క్యాంపు కార్యలయంలో వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఐనవోలు, హసన్పర్తి మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరూరి రమేశ్ మాట్లాడుతూ అభివృద్థి పనులు ప్రారంభోత్సవం అనంతరం భారీ బహిరంగ సభ ఉంటుందని, ప్రతి మండలం, డివిజన్, గ్రామాల నుంచి భారీగా జన సమీకరణ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు. అలాగే, గ్రేటర్ 49వ డివిజన్ కార్పొరేటర్ ఏనుగుల మానసా రాంప్రసాద్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎంఏ సమద్ ఆధ్వర్యంలో ప్రగతినగర్, విడోస్కాలనీ, నాగేంద్రనగర్, లోటస్ కాలనీ, ఇందిరమ్మ కాలనీల్లో జన సమీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఆర్టీయూ అనుబంధ సంఘం రాష్ట్ర నాయకురాలు మైముద, రాజమణి, సారంగం, డప్పు శ్రీనివాస్, ప్రసాద్ పాల్గొన్నారు.
హనుమకొండ/సుబేదారి : వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో శుక్రవారం నిర్వహించనున్న మంత్రి కేటీఆర్ బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని నియోజకవర్గ డివిజన్ల జన సమీకరణ ఇన్చార్జి, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ విజయవంతం చేసేందుకు చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆదేశాల మేరకు బుధవారం నియోజకవర్గలోని 51,52, 54,57,59 డివిజన్లలో జన సమీకరణకు వాసుదేవరెడ్డి ఆయా డివిజన్ల ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం 5గంటలకు ఫాతిమానగర్లోని సెయింట్ గ్యాబ్రియల్స్ పాఠశాల మైదానంలోజరిగే భారీ బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతారన్నారు. ఈ సభకు ప్రతి డివిజన్ నుండి వెయ్యి మంది తగ్గకుండా జనాన్ని సమీకరించాలని సూచించారు. ప్రతి 50 మందికి ఒకరిని ఇన్చార్జిగా నియమించాలన్నారు. సమావేశంలో పార్టీ యువజన నాయకులు డాక్టర్ బీ వీరేందర్, లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు బోయినపల్లి రంజిత్రావు, గుంటి రజితా శ్రీనివాస్, నల్ల స్వరూపారాణి సుధాకర్రెడ్డి, డివిజన్ల అధ్యక్షులు సుగుణాకర్రెడ్డి, గంగాధర రాజు, మోహన్, నాయకులు కోన శ్రీకర్, కేశవరెడ్డి, రాజు, సబిత, శ్వేత, సంధ్య, లత, రాణి పాల్గొన్నారు.