నర్సంపేట, అక్టోబర్ 30: దళితబంధు ఇచ్చింది దేశంలోనే తెలంగాణలో మాత్రమేనని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేటలో తెలంగాణ దళిత ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది గెలుపుకోసం పనిచేసేందుకు ఏకగ్రీవంగా తీర్మానించారు. తెలంగాణ దళిత ఫెడరేషన్ నియోజకవర్గ కమిటీని ఎన్నుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు సమున్నత గౌరవం దక్కేలా చర్యలు తీసుకుందన్నారు. దళితబంధులో రూ.10లక్షల చొప్పున యూనిట్ ఆర్థికంగా ఆదుకున్నట్లు తెలిపారు. అర్హులందరికీ ఈ పథకం వర్తించేందుకు చర్యలు తీసుకుంటామని నర్సంపేటలోనూ గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి చేసి చూపినట్లు తెలిపారు.ప్రజలు మళ్లీ తనను ఆశీర్వదించి గెలిపించాలని కాగా, తెలంగాణ దళిత ఫెడరేషన్ నియోజకవర్గ ఇన్చార్జ్గా, అధ్యక్షుడిగా దబ్బెట శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా నల్లబెల్లి మండల ఇన్చార్జ్గా కాకి సతీశ్,ప్రధాన కార్యదర్శిగా మేకల సదానందం, పాతముగ్ధుంపురం సర్పంచ్, చెన్నారావుపేట మండల ఇన్చార్జ్గా, అధికార ప్రతినిధిగా, దీక్షకుంట్ల ఎంపీసీటీ సభ్యుడు లింగాల అజయ్, నెక్కొండ మండల ఇన్చార్జ్గా, కోశాధికారిగా అంజపెల్లి రాజు సోషల్ మీడియా ఇన్చార్జ్ నర్సంపేట టౌన్, నర్సంపేట ఇన్చార్జ్, కార్యదర్శులుగా వేదొండ రాజు నర్సంపేట మండల ఇన్చార్జ్గా, దామెర సుధాకర్ దుగ్గొండి మండల ఇన్చార్జ్గా,చెడిపాక అశోక్ ఖానాపురం మండల ఇన్చార్జ్గా నియమించారు. జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, రాయిడి రవీందర్రెడ్డి, కేతిడి వీరారెడ్డి, గోనె యువరాజు పాల్గొన్నారు.
చెన్నారావుపేట: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులందరూ బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారని నర్సంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని తెలంగాణ ఉద్యమకారులు ఎమ్మెల్యే పెద్దిని మర్యాదపూర్వకంగా కలిసి మద్దతుతెలిపారు. ఆయన మాట్లాడుతూ ఉద్యమకారుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ వారి సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఉద్యమకారులను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. ఉద్యమకారుల అభివృద్ధి కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో మాట్లాడిన పెద్ది గెలుపు కోసం కృషి చేస్తామని ఉద్యమ కారులు అన్నారు. ఉద్యమ కారులు రఫీ, టేకుల స్వామి, నర్సింగారావు, వీరాసింగ్, రమేశ్, రాజేందర్, యాకయ్య, సాంబయ్య, మల్లయ్య, కృష్ణయ్య, రాజ్కుమార్ పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్: బీఆర్ఎస్తోనే ప్రజా సంక్షేమ పాలన అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురిజాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యుడు మర్ధ కుమారస్వామి, సిద్ద రాజు, మడిపెద్ది రాజు, గానిపాక మహేందర్, పాలకుర్తి దిలీప్ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి పెద్ది గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల కార్యకర్తలు బీఆర్ఎస్లో తెలిపారు. సర్పంచ్ గొడిశాల మమతా సదానందంగౌడ్ ఎంపీటీసీ బండారు శ్రీలతా రమేశ్, బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు అల్లి రవి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు దూడల ప్రకాశ్, వార్డు సభ్యుడు ఆముదాల రమేశ్, మాజీ నీటి సంఘం అధ్యక్షుడు మాటూరి రవీంద్రాచారి, మండల యూత్ నాయకుడు ఎడ రమేశ్, సోషల్ మీడియా వారియర్ రేకుల భరత్, కడగండ్ల రాము ఉన్నారు.
నల్లబెల్లి: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ మల్యాల శ్రీనివాస్రావు, వేదనగర్ బీజేపీ గ్రామ అధ్యక్షుడు పెండ్లి రాజు, కన్నారావుపేటకు బీజేపీ నాయకుడు ఆవాల శ్రీనివాస్రెడ్డి సోమవారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యేపెద్ది సుదర్శన్రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ తాను గెలిచాక విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్ద పీట వేశానని, మరోసారి ప్రజలు ఆశీర్వదిస్తే మిగతా పనులను పూర్తి చేస్తానని తెలిపారు. సర్పంచ్లు చింతపట్ల సురేశ్రావు, కరివేదుల వెంకట్రెడ్డి, తంగెళ్ల రవీందర్రెడ్డి, మామిడిశెట్టి రవికుమార్ పాల్గొన్నారు.