జనగామ చౌరస్తా, జనవరి 18: ‘స్కూల్ గేమ్స్ ఫెడరేషన్’ ఆధ్వర్యంలో జనగామలో నిర్వహించిన అండర్-14 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ఉమ్మడి వరంగల్ జట్టు మెరిసింది. బాలికల విభాగంలో నల్గొండ జట్టు విజయకేతనం ఎగురవేసింది. బాలుర విభాగంలో నల్గొండపై వరంగల్ జట్టు, బాలికల విభాగంలో వరంగల్పై నల్గొండ జట్టు గెలిచింది. గురువారం జరిగిన కబడ్డీ ఫైనల్స్కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచేలా కబడ్డీ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు జార్ఖండ్, కడప వెళ్తున్న తెలంగాణ జట్టు క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా జనగామ పట్టణంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి త్వరలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలిస్తానని తెలిపారు.
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం క్రీడా పోటీలు నిర్వహించేలా తనవంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా చిన్నారులు చేసిన నృత ప్రదర్శన పలువురిని అలరించింది. క్రీడల్లో విజేతలకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఈవో రాము, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జము న, కౌన్సిలర్లు మల్లిగారి చంద్రకళ రాజు, బొట్ల శ్రీనివాస్, విద్యాశాఖ అకాడమిక్ జిల్లా కోఆర్డినేటర్ బీ శ్రీనివాస్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ డాక్టర్ తోటకూరి వెంకటేశ్వర్లు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ స్టేట్ అబ్జర్వర్ రవికుమార్, జిల్లా సెక్రటరీ పోగుల నరేందర్ గౌడ్, పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఎస్వో ఎండబట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.