నయీంనగర్, జనవరి 2 : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న హనుమాన్ నగర్కు చెందిన బొజ్య విశ్వతేజ, కోమటిపల్లికి చెందిన తిప్పని సూర్యతేజ మరొక మిత్రుడితో కలిసి గురువారం అర్ధరాత్రి బైక్పై వెళ్తున్నారు.
ఈ క్రమంలో కేయూ పోలీసుస్టేషన్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద డివైడర్ను ఢీకొట్టడంతో విశ్వతేజ, సూర్యతేజకు తీవ్ర గాయాలయ్యాయి. ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ విశ్వతేజ, హైదరాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతూ సూర్యతేజ మృచెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.