మల్లంపల్లి, జూలై 12 : ఇసుక లారీ ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా మల్లంపల్లిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం మండల కేంద్రంలోని వైన్స్ షాపు ముందు నుంచి నడుచుకుంటూ వస్తున్న ఇద్దరిని హనుమకొండ నుంచి ములుగు వైపు వెళ్తున్న ఇసుక లారీ అతి వేగంగా ఢీకొట్టడంతో వారు అక్కడిక్కడే మృతి చెందారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
విషయం తెలుసుకున్న ములుగు ఎస్సై ఎస్ వెంకటేశ్ సిబ్బందితో చేరుకొని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతి చెందిన వారిలో ఒకరిది శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామం కాగా, మరొకరిది ములుగు మున్సిపాలిటీ పరిధిలోని ప్రేమ్నగర్గా గుర్తించినప్పటికీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇద్దరి మృతికి కారణమైన లారీని ఆగకుండా వేగంగా వెళ్లిన డ్రైవర్ జాకారం వద్ద ముందున్న మరో లారీని ఢీకొట్టి అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది.