నర్సంపేట రూరల్, డిసెంబర్ 9: నర్సంపేట-మల్లంపల్లి జాతీయ రహదారిపై ఇటుకాలపల్లి వద్ద నెత్తురోడింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో బైక్పై వెళ్తున్న తాత, మనవరాలు అక్కడికక్కడే మృతి చెందగా, నానమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. నర్సంపేట మండలం ఆకులతండా గ్రామానికి చెందిన ధరావత్ పాచ్యా(62)నాగమ్మ దంపతులు, తమ కుమారుడి కూతురైన ధరావత్ పూర్ణిమ (3)ను తీసుకొని ద్విచక్రవాహనంపై ఇటుకాలపల్లిలోని మెడికల్ షాపు వద్దకు వెళ్లారు. అక్కడ మందులు తీసుకొని తిరిగి వస్తుండగా మల్లంపల్లి నుంచి నర్సంపేటకు వెళ్తున్న ఓ సిమెంట్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది.
ఈ ఘటనలో బైక్పై ఉన్న చిన్నారి పూర్ణిమ, ధరావత్ పాచ్యా, నాగమ్మ కిందపడిపోగా తల, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి బాధితులను నర్సంపేలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పూర్ణిమకు వైద్యులు చికిత్స అందిస్తుండగానే మృతి చెందింది. మిగితా ఇద్దరిని వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలిస్తుండగా ధరావత్ పాచ్యా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. నాగమ్మను ఎంజీఎంలో చేర్చగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
మృతదేహాలు పోస్టుమార్టంకు తరలింపు
పాచ్యా, పూర్ణిమ మృతదేహాలను నర్సంపేట దవాఖానలోని పోస్టుమార్టన్కు తరలించారు. ఇదిలా ఉండగా చిన్నారి తండ్రి దారావత్ యాకూబ్ ఛత్తీస్గడ్లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. తల్లి దివ్య మాత్రం ఆకులతండాలో అత్తమామలతో కలిసి ఉంటుం ది. తాత, మ నుమరా లు మృతితో ఆకులతండాలో విషా దం నెలకొంది. ఈ ఘటనపై పూర్ణిమ తల్లి దివ్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మృ తురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నర్సంపేట టౌన్ సీఐ పులి రమేశ్గౌడ్ తెలిపారు.