వారి కోసం సీఎం కేసీఆర్ పథకాలు అమలు
సాధించుకున్న హక్కులను కాలరాస్తున్న కేంద్రం
చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ప్రత్యేక కార్యాచరణ
మే నెల కార్మిక చైతన్య మాసోత్సవంగా నిర్వహణ
నేడు సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్లో ధర్మయుద్ధం
హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు
దేశసంపదను సృష్టిస్తున్న కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ వారి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పోరాడి సాధించుకున్న చట్టాలు, హక్కులను సవరణ పేరుతో కాలరాస్తోంది. దీంతో కార్మికులకు తీరని నష్టం వాటిల్లుతోంది. ఈ క్రమంలో మోదీ సర్కారు విధానాలను ఎండగట్టడంతోపాటు కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. మే నెలను కార్మిక చైతన్య మాసోత్సవంగా ప్రకటించారు. కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా హరిస్తున్నదో వివరిస్తున్నారు. మంగళవారం ఫాతిమానగర్లోని సెయింట్ గ్యాబ్రియల్ పాఠశాల మైదానంలో కార్మిక ధర్మయుద్ధం నిర్వహిస్తుం డగా, ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
హనుమకొండ, మే 30 : కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్ర భుత్వ లక్ష్యం. వారికి అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ పలు పథకాలను అమలు చేస్తున్నారు. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తోందని పలువురు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, 4 కోడ్లను తీసుకొచ్చి కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహిస్తుందని, దీంతో కార్మికులకు తీరని నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లు నిర్ణయించిన ధరకే అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పించిందుకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. కార్మికులు, కార్మిక సంఘాల నాయకులతో కలిసి మే నెలను కార్మిక చైతన్య మాసోత్సవంగా చేపట్టారు. ముగింపు వేడుకల్లో భాగంగా కేంద్రం ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు 31న ఉద్యోగులు, కార్మికులు, కార్మిక సం ఘాల నాయకులతో కలిసి ఫాతిమానగర్లోని సెయింట్ గ్రాబ్రియల్ స్కూల్ మైదానంలో ధర్మ యుద్ధం చేపట్టారు.
రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న కేంద్రం..
రాజ్యాంగానికి కేంద్రం ప్రభుత్వం తూట్లు పొడున్నదని కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. సవరణల పేరు చెప్పి ఉన్న 29 చట్టాలను రద్దు చేస్తూ 4 కొత్త కోడ్లుగా తీసుకొచ్చిందని, దీంతో హక్కులు కోల్పోవాల్సి వస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు. గతంలో కనీసం వేతన చ ట్టం ప్రకారం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించేవారు, కొత్త కోడ్తో యాజమాన్యాల నిర్ణయం ప్రకా రం వేతనాలు ఉంటాయి. కార్మికులు చనిపోతే సంస్థ పెన్షన్తోపాటు ఇతర సౌకర్యాలు కల్పించేవారు. గతంలో ఉన్న ఈఎస్ఐని రద్దు చేశారని, దీంతో కార్మికులే హెల్త్ ఇన్సూరెన్స్ సొంతంగా చేసుకోవాల్సి వస్తోంది. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రోత్సహిస్తున్నదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 8గంటలు పని చేయగా.. ప్రస్తుతం పని వేళలు 10 నుంచి 12 గంటలకు పెరిగాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని హెచ్చరిస్తున్నారు.
కార్మికులకు లక్ష ద్విచక్ర వాహనాలు..
దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ఇచ్చింది. వి ద్యుత్ శాఖలో వేలాది మంది ఆర్జిజన్లను రెగ్యులరైజ్ చేయడంతో పాటు 13,357 అదనపు పోస్టులు మంజూరీ చేసింది. తాజాగా 83 వేలకు పైగా పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించి నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల కార్మిక శాఖ మంత్రి సైతం కార్మిక సంక్షేమ మండలిలో రూ.11 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. ఏ రాష్ట్రంలోని లేని విధంగా ఆటోలకు రూ.77.3 కోట్ల టాక్సీని రద్దు చేసింది. గుమస్తాలకు కనీస వేతనం చట్టం అమలు చేస్తున్నారు. హామాలీలకు పని భద్రత కల్పించింది. తాజాగా భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ద్విచక్ర వాహనాలు అందిస్తామని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు.
కార్మిక ధర్మ యుద్ధాన్ని విజయవంతం చేయాలి
కాజీపేట ఫాతిమానగర్లోని సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ మైదానంలో మంగళవారం సాయంత్రం నిర్వహించే కార్మిక ధర్మ యుద్ధాన్ని విజయవంతం చేయాలని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా కార్మికులకు చేరేలా, అలాగే సంఘటిత, అసంఘటిత కార్మికుల హక్కు లు, చట్టాలపై అవగాహన కల్పించి వారిని చైతన్యం చేయడమే కార్మిక చైతన్య మాసోత్సవం ముఖ్య ఉద్దేశం అన్నారు. కార్మికుల నివాస ప్రాంతాల్లో పర్యటించి వారి కుటుంబాల స్థితి గతులు తెలుసుకుంటున్నట్లు వివరించారు. కార్మికుల పిల్లల విద్య, ఆరోగ్యం విషయంలో ప్రత్యేక దృష్టి సారించామన్నారు. డ్రాపౌట్స్ పిల్లలను గురుకుల పాఠశాలల్లో చేర్పించనున్నట్లు వెల్లడించారు. అలాగే, ఇప్పటికే పలువురు ఇంజినీరింగ్, ఎంబీబీఎస్లలో ర్యాంకులు సాధించి ఫీజు కట్టలేని విద్యార్థులకు ఆర్థిక సాయం చేసినట్లు వివరించారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, ఉచితంగా పరీక్షలు చేసి, మందులు అందజేయడంతో పాటు సీరియస్గా ఉంటే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు పంపిస్తున్నాం. అదేవిధంగా కార్మికుల్లో ఒత్తిడి తగ్గించేందుకు, ప్రతిభ వెలికి తీసేందుకు క్రీడా, సాంస్కృతి పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. కార్మిక ధర్మ యుద్ధానికి పెద్ద సంఖ్యలో కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు హాజరై విజయవంతం చేయాలని, గల్లీలోని కార్మిక గళం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి వినిపించాలని వినయ్భాస్కర్ విజ్ఞప్తి చేశారు.