వరంగల్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా గ్రేటర్ వరంగల్ 1, 2వ డివిజన్ల పరిధిలోని పెగడపల్లి గ్రామం నుంచి వివిధ పార్టీలకు చెందిన సుమారు 100 మంది నాయకులు, కార్యకర్తలు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్లు నరెడ్ల శ్రీధర్, జంగ కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ బానోత్ కల్పన సింగ్ లాల్, ఏఎంసీ డైరెక్టర్ గణిపాక విజయ్, కూడా డైరెక్టర్ నన్నెబోయిన రమేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.