ఖిలావరంగల్, జనవరి 10 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చికి గిట్టుబాటు ధర కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ పీ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం ఆమె జిల్లా మారెటింగ్ అధికారి పీ ప్రసాదరావుతో కలిసి మార్కెట్ యార్డులో మిర్చి క్రయవిక్రయాలు, ధరలపై సమీక్షించారు. మూడు నెలల వరకు మారెట్కు మిర్చి ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. నిత్యం పర్యవేక్షిస్తూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చూడాలని సూచించారు. మిర్చి నాణ్యత, తేమ శాతంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
రాష్ట్రంలోని వివిధ మారెట్లలో మిర్చి ధరను ఎప్పటికప్పుడు తెలుసుకొని, అందుకనుగుణంగా క్రయవిక్రయాలు జరిగేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. తరచూ మారెట్ను సందర్శిస్తూ క్రయవిక్రయాలను పర్యవేక్షించి తనకు నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ మిర్చి వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏటా ఇండోనేషియా, బంగ్లాదేశ్, చైనా దేశాలకు మిర్చి ఎగుమతి చేస్తున్నామని, ప్రస్తుతం ఆ దేశాల నుంచి ఎలాంటి ఆర్డర్లు రాలేదన్నారు. రైతులు తమకు గిట్టుబాటు ధర రాలేదని భావిస్తే కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసి ఆరు నెలల వరకు ఎలాంటి వడ్డీ లేని రూ. 2 లక్షల వరకు రుణం పొందొచ్చని రైతులను వారు కోరారు.