పరకాల, ఏప్రిల్ 29 : కడియం శ్రీహరి మోసగాడని, అరూరి రమేశ్ మా యగాడని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకు బుద్ధి చెప్పేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధ్దంగా ఉండాలని పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారెపల్లి సుధీర్ కు మార్ అన్నారు. పరకాలలో జరిగిన ము ఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్ కుమార్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే కేంద్రంలో తెలంగాణవాదం నిలుస్తుందని, లేదంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ర్టాన్ని అధోగతి పాలు చేస్తాయన్నారు. కేంద్రంలోని బీజేపీ రాష్ర్టానికి చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్లో పదవులు అనుభవించి కడి యం కాంగ్రెస్లో చేరి మోసానికి కేరాఫ్గా నిలిచిడాన్నారు. బీఆర్ఎస్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అరూరి అధికార దాహంతోనే బీజేపీ తరుఫున పోటీ చేస్తున్నాడని విమర్శించారు. చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమి ఖాయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, నేతలు బండి సారంగపాణి, నేతాని శ్రీనివాస్రెడ్డి, చందుపట్ల సాయి తిరుపతి రెడ్డి, శనిగరపు రజినీనవీన్ పాల్గొన్నారు.
శాయంపేట : తెలంగాణ కోసం పోరాడే రియల్ ఫైటర్ కేసీఆర్ మాత్రమేనని, ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని పెద్దకోడెపాక, మైలారం, పత్తిపాక, హుస్సేన్పల్లి గ్రామా ల్లో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి మారెపల్లి సుధీర్ కుమార్ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో తాగునీటి కష్టాలు, సాగునీటి ఇబ్బందులు ఎన్నడూ తలెత్తలేదన్నారు. కేసీఆర్ను బద్నాం చేసేందుకు గోదావరి జలాలను సముద్రం పాలు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్య ప్రాజెక్టుగా చూపించి రైతులకు నీళ్లు ఇవ్వకుండా నిండా ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేయాలో ఆలోచించాలన్నారు. జడ్పీ గండ్ర జ్యోతి మాట్లాడుతూ ప్రజలకు న్యాయం జరగాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతుగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, మండలాధ్యక్షుడు గంగుల మనోహర్రెడ్డి, మాజీ సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి, నాయకులు రాంశెట్టి లక్ష్మీరెడ్డి, గంట శ్యాంసుందర్రెడ్డి, అమ్మ అశోక్ పాల్గొన్నారు.
కరీమాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్లో గులాబీ జెండా ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 41వ డివిజన్లో బూత్ కమిటీల నియామక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలన్నారు. తూర్పు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ అందించాలన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే వదిలి పెట్టమన్నారు. సమావేశంలో బజ్జూరి రవి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.