ములుగు : జిల్లాలోని పందికుంట స్టేజి వద్ద సోమవారం రాత్రి దుండగులచే హతమార్చబడిన ప్రముఖ న్యాయవాది, మైనింగ్ వ్యాపారి మూలగుండ్ల మల్లారెడ్డి మృతదేహానికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. కాగా, మల్లారెడ్డికి సమీప బంధువైన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మృతదేహాన్ని సందర్శించి పోస్టుమార్టం పూర్తి అయ్యేవరకు అక్కడే ఉన్నారు.
మైనింగ్ భూ తగాదాల వల్ల మల్లారెడ్డిని ప్రత్యర్థులు హతమార్చారని, ఇలాంటి హత్యలు పునరావృతం కాకుండా హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ధర్మా రెడ్డి అన్నారు. అలాగే న్యాయవాదిని హతమార్చిన దుండగులను కఠినంగా శిక్షించాలని ములుగు జిల్లా కోర్టులోని న్యాయవాదులు ప్లేకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.