వరంగల్ : వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. భార్యభర్తల మధ్య జరిగిన గొడవలో భార్య మృతి చెందింది. జిల్లాలోని చెన్నారావుపేట మండలం అమీనాబాద్లో భర్త రమేశ్, భార్య అరుణ మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో రగిలిపోయిన భర్త, భార్య తలపై గట్టిగా కొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. గొడవకు గల కారణాలను కుటుంబ సభ్యుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు.