వరంగల్, ఫిబ్రవరి 6: గ్రీవెన్స్లో ఇచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని బాధితులు కమిషనర్ ప్రావీణ్యను కోరారు. రోడ్లు, డ్రైనేజీలు, పైన్లైన్లు, రోడ్ల సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సోమవారం బల్దియా కౌన్సిల్ హాల్లో నిర్వహించిన గ్రీవెన్స్లో బాధితులు కమిషనర్కు వినతిపత్రాలు అందజేశారు. నెలల తరబడి ఎదుర్కొంటున్న సమస్యలపై అనేకసార్లు వినతులు ఇచ్చినా పరిష్కారం కావడం లేదని వారు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. 56వ డివిజన్ పరిధిలోని పరిమళకాలనీలో గతేడాది 50 ఫీట్ల సీసీరోడ్డు నిర్మించి ఇరుపక్కల డ్రైనేజీ నిర్మాణం చేయకపోవడంతో రోడ్డుపైన మురుగునీరు ప్రవహిస్తున్నదని కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కమిషనర్కు విన్నవించారు.
2వ డివిజన్ పరిధిలోని వంగపహాడ్, గుండ్లసింగారం, పెగడపల్లి, రెడ్డిపురంలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ లావుడ్యా రవి కమిషనర్ను కోరారు. జేఎన్ఎస్లో వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వాకింగ్ చేస్తున్నారని, వారి కోసం ట్రాక్ వేయాలని ఎల్లయ్య, కూతురు రమేశ్ వినతిపత్రం అందజేశారు. 4వ డివిజన్ యాదవనగర్లో ర్యాంపులను తొలగించాలని కోరారు. 55వ డివిజన్ అరుణోదయకాలనీలో అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీని నిర్మించాలని కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు గ్రీవెన్స్లో అధికారులకు వినతిపత్రం అందజేశారు.
నక్కలగుట్ట వార్డు కార్యాలయంలోని పబ్లిక్ టాయ్లెట్ నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని అభ్యుదయ దళిత సొసైటీ ప్రతినిధులు కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. మొత్తం 59 వినతులు రాగా, టౌన్ప్లానింగ్ విభాగానికి 38, తాగునీటి సరఫరా విభాగం 5, ఇంజినీరింగ్ విభాగానికి 7, ప్రజారోగ్యం, శానిటేషన్ 3, పన్నుల విభాగానికి 6 వినతులు వచ్చాయి. అదనపు కమిషన ర్ రవీందర్యాదవ్, ఎస్ఈలు కృష్ణారావు, ప్రవీణ్చంద్ర, సీఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్, సీహెచ్వో శ్రీనివాసరావు, సిటీ ప్లానర్ వెంకన్న, డిప్యూటీ కమిషనర్లు అనీసుర్ రషీద్, జోనా, శ్రీనివాస్రెడ్డి, బయాలాజిస్ట్ మాధవరెడ్డి, ఎంహెచ్వో డాక్టర్ రాజేశ్ పాల్గొన్నారు.