హనుమకొండ, ఏప్రిల్ 14: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం కేసీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.