హనుమకొండ, మార్చి 19 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మారెట్ యార్డులో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్ట్రాంగ్ రూములలో భద్రపరిచిన ఈవీఎంలు, వాటికి సంబంధించిన రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. హనుమకొండ జిల్లాకు సంబంధించి ఈవీఎంల కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్ల గురించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, ఆర్డీవోలు వెంకటేశ్, నారాయణ, తహసీల్దార్లు విజయ్ కుమార్, భాసర్, కలెక్టరేట్ ఏవో సత్యనారాయణ, ఎన్నికల విభాగం డీటీలు సంతోష్, శ్యాం కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు మణి, శ్యాంసుందర్, నేహాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు.