హనుమకొండ, జనవరి 17 : హైదరాబాద్లోని అల్విన్ కాలనీలో తెలంగాణ ఉద్యమకర్త దివంగత ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శ్రేణులతో ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి ఏకశిల పార్క్లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు నల్లబ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలు పట్టుకొని ర్యాలీగా వెళ్లి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణలో తొలి, మలిదశ ఉద్యమకారులను ఏకం చేశారని తెలిపారు. జరుగుతున్న అన్యాయాన్ని సభలు, ప్రజలను చైతన్యపరిచారని పేర్కొన్నారు.
ఆ మహనీయుడి విగ్రహాన్ని వ్యతిరేకులు ధ్వంసం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం విచారకరమన్నారు. స్వయంగా పోలీస్ అధికారులు అకడ ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కనీసం వారిని అడ్డుకోలేదన్నారు. ప్రభుత్వం స్పందించి దుండగులను వెంటనే అరెస్టు చేయాలని, అదే స్థలంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని మళ్లీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామన్నారు. కుడా మాజీ చైర్మన్లు సుందర్రాజ్ యాదవ్, మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు చెన్నం మధు, సోదా కిరణ్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, పార్టీ సీనియర్ నాయకులు పులి రజినీకాంత్, నయీముద్దీన్, పరశురాములు, వెంకటేశ్వర్లు, బైరపాక ప్రశాంత్ పాల్గొన్నారు.