పల్లె ప్రగతిలో చేపట్టిన పనులు
రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతిలో భాగంగా అనేక మౌలిక వసతులతో పాటు పచ్చదనంపై దృష్టి సారించింది. రూ.10లక్షలతో శ్మశానవాటిక, రూ.2లక్షలతో డంపింగ్ యార్డు, రూ.2 లక్షల 50వేలతో పల్లెప్రకృతి వనం, రూ.2లక్షల 10వేలతో సెగ్రిగేషన్ షెడ్డు, రూ.10లక్షలతో వీధిలైట్లు, రూ.22లక్షలతో రైతువేదిక, రూ.15లక్షలతో గ్రామ పంచాయతీ భవనం, రూ.16 లక్షలతో పల్లె దవాఖాన, రూ.3 లక్షలతో ఆయుర్వేద దవాఖాన, రూ.3 లక్షలతో గ్రంథా లయం, రూ.2 లక్షలతో నర్సరీ, బతుకమ్మ ఘాట్, రూ.5 లక్షలతో సీసీ కెమెరాలు, వీధుల్లో పరిశుభ్రత కోసం రూ.8లక్షల 50వేలతో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు, రూ.3 లక్ష లతో మిషన్ భగీరథ నీటి కోసం సంప్, ట్యాంక్ నిర్మాణం, బతుకమ్మ చెరువు, గ్రామ పంచాయతీ సమీపంలో రైతు వేదిక నిర్మించారు. అలాగే పల్లె ప్రకృతి వనం పచ్చదనంతో ఆహ్లాదం పంచుతున్నది. రూ.10లక్షలతో నీటి సమస్య పరిష్కారం కోసం పైప్లైన్లు, ట్యాంకులు ఏర్పాటు చేశారు. రూ.1కోటీ 80లక్షలతో ఊరంతా సీసీ రోడ్లు వేశారు.
సంఘాలకు భవనాలు..
గ్రామంలోని ప్రతి సంఘానికి పక్కా భవనాలు నిర్మించారు. కులసంఘాల భవనాలు నిర్మించి కులస్తులు ఐక్యంగా ఉండేలా కృషి చేస్తున్నారు. వీటితో పాటు మహిళా సంఘాల కోసం వీవో బిల్డింగ్ నిర్మించేందుకు ప్రణాళిక చేస్తున్నారు. ఇప్పటికే గ్రామంలో పక్కా పల్లె దవాఖాన, పశువైద్య శాల, గ్రంథాలయ భవనం, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల భవనం నిర్మించగా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అలాగే గ్రామంలో రూ.5.30కోట్లతో 165 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారు.
అందరి సహకారంతోనే..
అందరి సహకారంతోనే పెద్దముప్పారం గ్రామం అభివృద్ధి చెందింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ప్రోత్సాహంతో అన్ని సౌకర్యాలు కల్పించుకున్నాం. గ్రామానికి ఏ అవసరం ఉన్నా కాదనకుండా నిధులు ఇవ్వడం వల్లే అభివృద్ధి సాధ్యమైంది. ప్రభుత్వం తలపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఊరికి కొత్త కళ వచ్చింది. ఎప్పటికప్పుడు పాలకవర్గ సభ్యులతో చర్చించి ప్రజలకు కావాల్సిన పనులు చేయిస్తున్నా. రానున్న రోజుల్లో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా.
– నూకల హిమబిందు, సర్పంచ్
గ్రామం ఎంతో మారింది..
గతంతో పోల్చుకుంటే ఇప్పుడు గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది. వీధుల్లో సీసీ రోడ్లు లేక వానకాలంలో ఇబ్బంది పడేటోళ్లం. ఇప్పడు గ్రామంలోని అన్ని వీధుల్లో సీసీ రోడ్లు వేశారు. గతంలో జ్వరం, ఇతర ఆరోగ్య ఇబ్బందులొస్తే తొర్రూరుకు వెళ్లేటోళం. ఇప్పడు మా ఊళ్లోనే పల్లె దవాఖాన, ఆయుర్వేద దవాఖాన కట్టిండ్లు. డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటున్నరు. ఈ నాలుగేళ్లలో గ్రామం చాలా అభివృద్ధి చెందింది. అన్ని సౌకర్యాలు ఉన్నాయి.
– పయ్యావుల కృష్ణమూర్తి, గ్రామస్తుడు