మట్టెవాడ, డిసెంబర్ 7: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే నూతన విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, లేకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఈఈజేఏసీ) స్టేట్ చైర్మన్, కన్వీనర్ జాన్సన్, ఎన్ శివాజీ హెచ్చరించారు. ములుగురోడ్డులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణతోపాటు 13 రాష్ర్టాల్లో బిల్లును వ్యతిరేకిస్తున్నా నూతన విద్యుత్ చట్టాన్ని తీసుకురావాలని కేంద్రం చూస్తున్నదని ధ్వజమెత్తారు. ఈ బిల్లుతో వినియోగదారులు, రైతులు, ఉద్యోగులకు తీరనినష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు. కేవలం కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని కేంద్రం చూస్తున్నదని ఆరోపించారు. డిస్ట్రిబ్యూషన్స్ నష్టా ల్లో ఉన్నాయని చెప్పడానికి గల కారణాలను వివరిస్తూ కోల్ ఇండియా, క్లీన్ ఎనర్జీ చెస్, ట్రాన్స్ఫోర్టెషన్, పెరిగిన ఇంధన ధరలపై ఆధారపడి ఉన్న విషయాన్ని కేంద్రం గమనించాలన్నారు. తమకు సీఎం కేసీఆర్ మద్దతు ఇవ్వడం హర్షణీయమన్నారు. బుధవారం అన్ని విద్యుత్ కార్యాలయాల ఎదుట భోజన విరామ సమయం లో నిరసనలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల 15న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆందోళనలు చేస్తామన్నారు. బిల్లును ప్రవేశపెడితే ఫిబ్రవరి 1న సమ్మె చేస్తామన్నారు. టీఈఈఏ జనరల్ సెక్రటరీ రామేశ్వర్ శెట్టి, టీఈఈఏ అధ్యక్షుడు సంపత్రావు, సురేందర్రెడ్డి, రవి, వెంకటరామయ్య, విజేందర్రెడ్డి, తిరుపతి, వెంకట్, రాంసింగ్, మహేందర్రెడ్డి, చంద్రప్రకాశ్, శ్రీధర్రాజ్, దేవేందర్రెడ్డి, గోపీకిషన్, ధర్మారెడ్డి, రాజ్కుమార్ పాల్గొన్నారు.