సంధ్యా సమయాన ఆకాశం ఎర్రబారింది. కొద్దికొద్దిగా చీకటి పడుతోంది. చెరువు గట్టు నుంచి చేపల కోసం ఓ మత్స్య కార్మికుడు వల విసురుతున్నాడు. ఈ సుందరమైన దృశ్యాలు గురువారం సంగెం మండ లం ఎల్గూరురంగంపేట చెరువు వద్ద ఆవిష్కృతంకాగా.. ‘నమస్తే’ క్లిక్మనిపించింది.
– వరంగల్ ఫొటోగ్రాఫర్
రాయపర్తి, డిసెంబర్ 15 : వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని రాగన్నగూడెం గ్రామంలో రైతులు తయారు చేసి విక్రయిస్తున్న సేంద్రియ ఎరువులను ఆయన పరిశీలించి, సేంద్రియ ఎరువు ప్యాకెట్ను కొనుగోలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే గోదావరి జలాలను రైతుల పొలాలకు మళ్లించి సస్యశ్యామలం చేశారని అన్నారు. అంతేకాక రైతులకు సరైన సమయంలో మేలైన విత్తనాలు, ఎరువులు, సాగుకు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తున్నారని చెప్పారు.
రైతులు సేంద్రియ ఎరువులను కూడా తయారు చేసుకొని మంచి దిగుబడులు సాధించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. జాతీయస్థాయిలో కూడా కేసీఆర్ రైతులకు సేవలందించాలని దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల ప్రతినిధులు, మేధావులు కోరుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి దేశంలో మంచి ఆదరణ లభిస్తుందని మంత్రి దయాకర్రావు అన్నారు.
పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను గురువారం అందజేశారు. కొండాపురం గ్రామానికి చెందిన రాములమ్మకు రూ.60వేలు, బంధన్పల్లి గ్రామానికి చెందిన సీహెచ్ విజయకు రూ.25వేలు, ఏకేతండాకు చెందిన హెచ్ అరుణకు రూ.60వేలు, సూర్యాతండాకు చెందిన ఎం అరుణ్కుమార్కు రూ.లక్ష సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి దయాకర్రావు అందజేశారు. అలాగే, మండలంలోని రాగన్నగూడెం గ్రామానికి చెందిన పున్నం మమత, ఎల్లేశ్ కుమార్తె వర్షిణి నూతన వస్త్ర పుష్పాలంకరణ వేడుకలకు మంత్రి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.