పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభం కాగా, తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. మొదటిరోజు తెలుగు పరీక్ష ఉండగా పరీక్ష కేంద్రాల వద్ద తల్లిదండ్రులు తమ పిల్లలకు ‘ఆల్ ది బెస్ట్’ చెబుతూ సాగనంపడం కనిపించింది. కాగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సజావుగా జరిగినట్లు అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లాలో 9,448మంది విద్యార్థులకు గాను 9,432మంది, హనుమకొండలో 12014మందికి 12వేలు, జయశంకర్ భూపాలపల్లిలో 3547 మందికి 3536, ములుగులో 388మందికి 3081, జనగామలో 6698మందికి 6687, మహబూబాబాద్లో 8,192 మంది విద్యార్థులకు గాను 8,173 మంది హాజరయ్యారు.