సంగెం, సెప్టెంబర్ 6 : కేసీఆర్ కృషి, పట్టుదలతోనే రాష్ట్రం సస్యశ్యామలమైందని, దేశంలో పేదల కోసం పనిచేసే ఏకైక నాయకుడు ఆయనేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి సంగెం మండలంలోని గుంటూరుపల్లి, కాపులకనపర్తి, గవిచర్ల గ్రామాల్లో రూ.27 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పేదల ప్రజల కోసం అహర్నిశలు కష్టపడే మహానాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ఆయన సీఎం అయ్యాకే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించిందన్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల వల్లనే గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో బీడు భూములన్ని 3 పంటలు పండే భూములయ్యాయన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన, పదేళ్ల బీజేపీ పాలన ప్రజలను మోసం చేసిందన్నారు. ఊళ్లకు వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను ప్రశ్నించి నిలదీయాలన్నారు. రేవంత్రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
వ్యవసాయాన్ని పండుగ చేసింది కేసీఆరే
వ్యవసాయాన్ని పండుగలా చేసింది సీఎం కేసీఆర్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ సీఎం అయ్యాక విద్యుత్ సంస్కరణలు చేసి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి భూములకు నీరందించారన్నారు. 24 గంటలు వ్యవసాయానికి కరెంటు ఇచ్చి మూడు పంటలు పండించేలా చేశారన్నారు. మూడు పంటలు ఇచ్చే కేసీఆర్ను తిరిగి సీఎంగా చేసుకోవాలన్నారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున నష్టపరిహారం ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. కాంగ్రేసోల్లు చాతకాని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. గృహలక్ష్మి పథ కం కింద ఇల్లు కట్టుకునే వారికి రూ.3లక్షలు ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్డీవో ఎం సంపత్రావు, నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, సర్పంచ్లు రాజ్యలక్ష్మి, ఎర్రబెల్లి గోపాల్రావు, దొనికల రమాశ్రీనివాస్, బోంపెల్లి జయశ్రీ దిలీప్రావు, ఎంపీటీసీలు సుతారి బాలకృష్ణ, గూడ సంపత్రెడ్డి, రజితా రాజు, తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీవో వెంకటేశ్వర్రావు, పీఆర్, విద్యుత్ అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు