బాలల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం బాల అదాలత్ బెంచ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. బాలలపై దాడులకు చరమగీతం పాడాలంటే మానవతా విలువలు పెంపొందించాలని సూచించారు. బాలల హకుల పరిరక్షణ కమిషన్ తీసుకునే ప్రతి నిర్ణయం సాహసోపేతమని, బాలల రక్షణ కోసం తీసుకునే చర్యలు దేశానికి ఆదర్శంగా నిలువాలని వినోద్కుమార్ ఆకాంక్షించారు.
హనుమకొండ, సెప్టెంబర్ 21 : బాలల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. కలెక్టరేట్లో ఎస్సీపీసీఆర్ సభ్యుడు యెడ్లపల్లి బృందాధర్రావు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన బాల అదాలత్ బెంచ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో బాలల సమస్యల పరిష్కారానికి హనుమకొండ జిల్లాలో తొలిసారిగా బాల అదాలత్ బెంచ్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. బాలలపై హింసా, లైంగిక దాడులు, హత్యల వంటి సంఘటనలు బాధాకరమని, అవి పునరావృతం కాకుండా ఉండాలంటే పిల్లల్లో మానవతా విలువలు పెంపొందించాలని సూచించారు. పిల్లలకు సేఫ్ టచ్, అన్ సేఫ్ టచ్ విషయంపై తల్లిదండ్రులు, అకాచెల్లెళ్లు అవగాహన కల్పించాలని చెప్పారు. బాలల సంరక్షణ కోసం పోక్సో చట్టం 2012, బాలల న్యాయ చట్టం 2015, కమిషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ 2005 లాంటివి ఉన్నాయన్నారు.
బాలల రక్షణ సంరక్షణలో ప్రభుత్వం విఫలమైనప్పుడు కమిషన్కు చర్యలు తీసుకొనే అవకాశం ఉందని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కమిషన్ పనిచేస్తోందని అన్నారు. బాలల హక్కుల పరిక్షణ కోసం స్వచ్ఛంద సంస్థలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, కోర్టులు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం, బాలల హకుల పరిరక్షణ కమిషన్ తీసుకునే ప్రతి నిర్ణయం సాహసోపేతమని, బాలల రక్షణ కోసం తీసుకునే చర్యలు దేశానికి ఆదర్శంగా నిలువాలని వినోద్కుమార్ ఆకాంక్షించారు. హైకోర్టుకు ఉన్న సమాన హక్కులు కమిషన్కు ఉంటాయన్నారు. తల్లిదండ్రులు బాగా చూడకపోయినా కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. గతంతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలు పెరుగడమే కాకుండా నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు.
బాలల సమస్యల పరిష్కారం కోసమే బాల అదాలత్ బెంచ్..
– జోగినపల్లి శ్రీనివాసరావు, కమిషన్ చైర్మన్
బాలల సమస్యల పరిషారం కోసమే బాల అదాలత్ బెంచ్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జోగినపల్లి శ్రీనివాసరావు అన్నారు. బాల బాలికల విద్య, వైద్యం, ఆరోగ్యం, పౌష్టికాహారం, వారిపై జరిగే హింసాత్మక సంఘటనలపై కమిషన్ స్పందించి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బాలబాలికలు హకుల గురించి అవగాహన కలిగి ఉండాలని, ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు కావాలని ఆశాభావం వ్యక్తంచేశారు.
బాల అదాలత్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం : కలెక్టర్
బాలల సమస్యల పరిషారం కోసం బాల అదాలత్ ఏర్పాటు చేయడం శుభపరిణామం అని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అన్నారు. వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారుల సమన్వయంతో కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రజలకు చేరువయ్యామని చెప్పారు. ఈ సందర్భంగా కళాకారులు పాటలు పాడారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, రాష్ట్ర బాలల హకుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఏ శోభారాణి, సీహెచ్ రాగజ్యోతి, ఏ దేవయ్య, అపర్ణ, అంజన్రావు, ఐసీడీఎస్ ఆర్జేడీ ఝాన్సీలక్ష్మీబాయి, జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత, సీడీపీవోలు మధురిమ, భాగ్యలక్ష్మి, సూపర్వైజర్లు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ పీ సుధాకర్, ఎస్ రాజేంద్రప్రసాద్, పీ హైమావతి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి పీ సంతోష్కుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్ ప్రవీణ్కుమార్, మౌనిక, సతీశ్కుమార్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్లు, అంగన్వాడీ టీచర్లు, పలు శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బాల అదాలత్కు 345 దరఖాస్తులు
బాల అదాలత్ బెంచ్కు 345 దరఖాస్తులు వచ్చిట్లు కమిషన్ సభ్యులు వెల్లడించారు. దరఖాస్తులను వారం రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. విద్య, వైద్యం, అనాథ బాలల సర్టిఫికెట్లు, ఉపకార వేతనాలు, పింఛన్లు, రెవెన్యూ, సదరం సర్టిఫికెట్స్ అంశాలపై ఎక్కువగా వచ్చినట్లు వివరించారు.