హనుమకొండ సబర్బన్, జూన్ 5: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందిన లబ్ధిదారులందరూ రాష్ట్ర సర్కారుకు అండగా నిలవాలని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కోరారు. సోమవారం అంబేద్కర్ భవన్లో హనుమకొండ పశ్చిమ నియోజకవర్గస్థాయి విద్యుత్ ప్రగతి కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన చీఫ్ విప్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అనేక సమస్యలు రాజ్యమేలుతుండగా సీఎం కేసీఆర్ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారని, అందులో విద్యుత్ విజయం గొప్పదని కొనియాడారు. ఇప్పుడు రాష్ట్రంలో సరఫరా చేస్తున్న నిరంతర విద్యుత్ వల్ల ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయిందన్నారు. టీఆర్వీకేఎస్ నాయకులను తీసుకుని వెళ్లి స్వయంగా ముఖ్యమంత్రితో చర్చించి 25వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించామని చెప్పారు. మరికొందరు అన్మ్యాన్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సి ఉందని, త్వరలోనే సమస్యలు కూడా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
జంగు పట్టిన జనరేటర్లు : సుందర్రాజ్ యాదవ్, కుడా, చైర్మన్
విద్యుత్ కోతల వల్ల 2014కు ముందు కాలేజీలు నడుసుడు కష్టంగానే ఉండేదని కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ అన్నారు. ఖర్చు ఎక్కువైనప్పటికీ తప్పని పరిస్థితుల్లో జనరేటర్లను కొని వినియోగించాల్సి దుస్థితి నెలకొనేదన్నారు. దానికి డీజిల్ ఖర్చు మోపెడు అయ్యేదని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు నిరంతర విద్యుత్ సరఫరా వల్ల వినియోగం పూర్తిగా తగ్గిపోయి జంగుపట్టాయని చెప్పారు.
విద్యుత్ ఆదాతో పెరిగింది : కలెక్టర్ సిక్తా పట్నాయక్
విద్యుత్ సరఫరాలో గతంలో వృథా అయ్యేదని ఇప్పుడు విద్యుత్ సంస్థలు చేపట్టిన అనేక సాంకేతిక చర్యలతో విద్యుత్ ఆదా అవుతుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. విద్యుత్ సరఫరాలో వచ్చిన ప్రగతితో పబ్లిక్ లైఫ్, ఫార్మర్ లైఫ్ పూర్తిగా మారిపోయిందన్నారు.
ఉద్యమ దశలోనే కేసీఆర్ విద్యుత్ ప్రణాళికలు : ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్రావు
తెలంగాణ ఉద్యమ సమయంలోనే సీఎం కేసీఆర్ విద్యుత్పై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్రావు వెల్లడించారు. ఎక్కడ కరంటు అందుబాటులో ఉంటే అక్కడి నుంచి కొనుగోలు చేశారని గుర్తుచేశారు. గతంలో ఒక్క పంట పండితే చాలు అనుకున్న రైతాంగం ఇప్పుడు మూడు పంటలు పండించుకునే స్థాయికి చేరుకుందన్నారు. పవర్ హాలిడేలతో మూత పడే దశలో ఉన్న పరిశ్రమలు ఇప్పుడు సాఫీగా నడుస్తున్నాయని పేర్కొన్నారు. కార్మికులకు చేతినిండా పనిదొరికి ఇతర రాష్ర్టాల నుంచి బతుకుదెరువు వచ్చిన కార్మికులు సైతం హాయిగా జీవిస్తున్నారన్నారు.
క్రెడాయ్ చైర్మన్ ప్రేమ్సాగర్రెడ్డి, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, మానస, సుంకు నర్సింగ్, ఎలకంటి రాములు, దేవరకొండ లక్ష్మి, మాజీ కార్పొరేటర్ గణేశ్, ఎస్ఈ వెంకటరమణ, డీఈ విజేందర్రెడ్డి, ఏడీఈలు నార్ల సుబ్రమణ్యేశ్వర్రావు, మల్లికార్జున్, దర్శన్కుమార్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీళ్లే.. : విద్యుత్ భవన్లో ఎన్పీడీసీఎల్ సీఎండీ
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్లు కనపడుతున్నాయని ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం విద్యుత్ విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన విద్యుత్ భవన్లో జాతీయ జెండాను ఆవిషరించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అభివృద్ధికి మూల కారణమైన విద్యుత్ రంగంపై దృష్టిసారించి తొమ్మిదేళ్లలో పలు ప్రాజెక్టులు ప్రారంభించి నట్లు వివరించారు. మెరుగైన, నాణ్యమైన విద్యుత్ 24గంటలు సరఫరా చేస్తున్నామని, వ్యవసాయానికి ఉచితంగా 24గంటలు ఇస్తున్నామని తెలిపారు. దీంతో తెలంగాణ అన్నపూర్ణగా మారిందన్నారు. ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు 101 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. సంస్థ డైరెక్టర్లు డైరెక్టర్లు గణపతి, మోహన్రెడ్డి, ఇన్చార్జి డైరెక్టర్ తిరుపతిరెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.