సీఎం కేసీఆర్ సూచన మేరకు బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల కోసమే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ తెలిపారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో కరీమాబాద్లో బీఆర్ఎస్ 32, 33, 39 డివిజన్ల ఆత్మీయ సమ్మేళనం గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ గడపగడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పేర్కొన్నారు.
కరీమాబాద్, మే 11 : బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల కోసమే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారని తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మె ల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో గురువా రం కరీమాబాద్లో 32, 33, 39 డివిజన్ ఆత్మీ య సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు కూర్చుని కష్టసుఖాలు చెప్పుకో వాలని, పార్టీ కోసం కలిసి పని చేయాలి సూచించారు. తెలంగాణ రాక ముందు పరిస్థితులు తెలంగాణ వచ్చినాక సీఎం కేసీఆర్ పాలనలో పరిస్థితులు అర్థం చేసుకోవాలన్నారు. వాటిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. కొట్లా డి సాధించుకున్న తెలంగాణ అభివృద్ది పథంలో దేశానికే ఆదర్శంగా ఉందన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు పారదర్శకంగా అందుతున్నాయన్నారు. గురుకులాలతో ఉత్తమ విద్య, విదేశీ విద్యకు రూ.20 లక్షలు, 2016 పింఛన్, 24 గంటల విద్యుత్, ఇంటింటికీ తాగునీరు, రైతు బంధు, కల్యాణలక్ష్మి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు తెలంగాణలో ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపం తెలంగాణ రాష్ట్రం అన్నారు. 50 ఏండ్లకు పైగా అధికారంతో ఉన్న కాంగ్రెస్ అప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు చేస్తదట అని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభు త్వం దేశ సంపదను దోచి పెడుతూ సంస్థలను ప్రైవేట్పరం చేస్తోందన్నారు. ప్రజలు కాంగ్రెస్, బీజేపీలను ప్రశ్నించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో ప్రతిపక్షాలకు పని లేకుండా పోయింద న్నారు. వరంగల్ అభివృద్ధికి ము ఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండగా ఉన్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వరంగల్లో 24 అంతస్తుల దవాఖాన నిర్మాణం చేస్తున్నారన్నారు. నూతన కలక్టరేట్, కొత్త బస్టాండ్ నిర్మాణం కానున్నాయన్నారు. 400 కోట్లతో శిక్షణ కేంద్రం, ఇండోర్ స్టేడియం ఏర్పా టు కానుందన్నారు. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడన్నారు. ఆయన నాయకత్వంలో ఏర్పడ్డ టీఆర్ఎస్ తెలంగాణ సాధించిందన్నారు. ప్రస్తుతం ఏర్పడ్డ బీఆర్ఎస్ దేశాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు.
కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తా..
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, మంత్రి కేటీఆర్ అండదండలతో నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కలిసి పని చేస్తానన్నారు. కార్యకర్తలకు అండగా ఉండి అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తానన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, పథకాలు చూసి ప్రతిపక్షాలకు కడుపు మసులుతోందన్నారు. కడుపుమంట తగ్గేందుకు తాయత్తులు కట్టించుకోవాలన్నారు. భారతదేశ ప్రజలు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో మరోపార్టీకి అవకాశం లేదన్నారు. ప్రతిపక్షాలకు చెప్పుకునేందుకు ఏమీ లేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు.
అజంజాహి మిల్లును అమ్ముకున్న ఘనత గత ప్రభుత్వాలదేనన్నారు. టెక్స్టైల్స్ పార్కును ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇస్తున్న ఘనత బీఆర్ఎస్దేనన్నారు. పార్టీని మరింతగా బలోపేతం చేయాలన్నారు. అనంతరం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ను గజమాలతో సన్మానించారు. మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లం పద్మ, ఎం అరుణ, సిద్ధం రాజు, డివిజన్ అధ్యక్షుడు పీ సందీప్, ఎం వినయ్, బీ నర్సింగం మాజీ కార్పొరేటర్లు పల్లం రవి, ఎన్ కల్పన, ఎం రజిత, ఎన్ శోభ, నాయకులు ఎం ప్రవీణ్, చింతాకుల సునీల్ తదితరులు పాల్గొన్నారు.