గిర్మాజీపేట, జనవరి 30: కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లాలో 6,816 మందికి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. 44 శిబిరాల్లో ఇప్పటివరకు 40,101 మందికి నేత్ర పరీక్షలు చేసినట్లు ఆయన వెల్లడించారు. కలెక్టరేట్లో ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాన్ని కలెక్టర్ గోపి ప్రారంభించారు. ఉద్యోగులు ఈ శిబిరాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
కలెక్టరేట్ శిబిరంలో 204 మంది ఉద్యోగులకు కంటి పరీక్షలు చేయగా, 78 మందికి రీడింగ్ గ్లాసులు, 71 మందికి ప్రిస్క్రిప్సన్ గ్లాసులు ఇచ్చామని డీఎంహెచ్వో వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకాడే, శ్రీవత్స కోట తదితరులు పాల్గొన్నారు. పర్వతగిరి, సంగెం, ఖిలావరంగల్, చింతల్ పీహెచ్సీల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను డీఎంహెచ్వో తనిఖీ చేశారు.
కంటి పరీక్షల వివరాలు..
జిల్లా కంటి వెలుగు ప్రోగ్రాం అధికారి డాక్టర్ గోపాల్రావు వివరాల ప్రకారం.. నర్సంపేట 22 వార్డులో 159 మందికి, రాయపర్తిలో 146, జల్లిలో 142, వరంగల్ వార్డు-12(దేశాయిపేట)లో 149, ఉప్పరపల్లిలో 152, వరంగల్ వార్డు- 22 (దేశాయిపేట)లో 154, వరంగల్వార్డు-35(చింతల్)లో 112, వరంగల్వార్డు- 39(ఎస్ఆర్ఆర్తోట)లో 171, ఖానాపూర్లో 162, దీక్షకుంట్ల 134, నెక్కొండ 157, నల్లబెల్లి 143 మందికి, వరంగల్వార్డు-3(పైడిపల్లి)లో 157, పర్వతగిరిలో 179, బానోజీపేటలో 152, వర్ధన్నపేట వార్డు-3(రాయపర్తి)లో 146, లక్ష్మీపూర్లో 138, వరంగల్వార్డు-32(ఎస్ఆర్ఆర్తోట)లో 145, వరంగల్వార్డు-39(ఫోర్ట్ వరంగల్)లో 171, అలంకానిపేటలో 167, దుగ్గొండిలో 150, చింతనెక్కొండలో 145,
కొంకపాకలో 142, వరంగల్వార్డు-42(రంగశాయిపేట)లో 80, సంగెంలో 201, వరంగల్వార్డు-21(చింతల్)లో 167, వరంగల్వార్డు-19(కాశీబుగ్గ)లో 168, వరంగల్వార్డు-15 (గీసుగొండ)లో 151, చెన్నారంలో 150, ఇటుకాలపల్లిలో 169, వరంగల్వార్డు-16(కీర్తినగర్)లో 176, చెన్నారావుపేటలో 202, గీసుగొండలో 150, తిరుమలాయపల్లిలో 149, ఊకల్లో 150, వరంగల్వార్డు-37(ఫోర్ట్వరంగల్)లో 172, గవిచర్లలో 210, వంచనగిరిలో 150, వరంగల్వార్డు-26( చింతల్)లో 151, వరంగల్వార్డు-17(పైడిపల్లి)లో 166, మేడెపల్లిలో 140, వరంగల్వార్డు-41(రంగశాయిపేట)లో 144, వరంగల్వార్డు-36(చింతల్)లో 168, ధర్మారావుపేటలో 202 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ గోపాల్రావు తెలిపారు.
నిర్లక్ష్యం చేయొద్దు : కలెక్టర్
ఖిలావరంగల్/పోచమ్మమైదాన్/కరీమాబాద్/నర్సంపేటరూరల్: కంటి సమస్యలను ప్రజలు నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ బీ గోపి సూచించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందిక కోసం ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం అవసరం ఉన్న వారికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఎల్బీనగర్లో గ్యాస్ గోదాం సమీపంలోని క్రిస్టల్ గార్డెన్లో కంటి పరీక్షలు చేస్తున్నారు.
ఫిబ్రవరి 1 నుంచి దేశాయిపేట రోడ్డులో కంటి వెలుగు శిబిరం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దేశాయిపేట, వాసవీకాలనీల్లోని కంటి వెలుగు శిబిరాల్లో సోమవారం 320 మందికి కంటి పరీక్షలు జరిగాయని మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ భరత్కుమార్, డాక్టర్ ఆకాంక్ష తెలిపారు. క్రిస్టల్ గార్డెన్లో 168 మంది పరీక్షలు చేశారు. కంటి వెలుగు శిబిరానికి రావాలని 32వ డివిజన్ కార్పొరేటర్ పల్లం పద్మ ఇంటింటికీ వెళ్లి ఆహ్వాన పత్రికలు పంపిణీ చేశారు. నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి, ఇటుకాలపల్లి హెల్త్ సబ్ సెంటర్లల్లో కంటి వెలుగు కార్యక్రమాలు చురుగ్గా కొనసాగాయి.
జర్నలిస్టులకు ప్రత్యేక శిబిరం
వరంగల్చౌరస్తా: జర్నలిస్టు కుటుంబాల కోసం ప్రత్యేక కంటి వెలుగు శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. మంగళవారం కలెక్టర్ డాక్టర్ గోపి, తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చేతులమీదుగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను సోమవారం డీఎంహెచ్వో వెంకటరమణ పరిశీలించారు.