హసన్పర్తి, ఏప్రిల్ 2 : అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్గా నిలిచిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. భీమారంలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ 55వ డివిజన్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మూడోసారి బీఆర్ఎస్ పార్టీయే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ చేస్తున్న కుట్రలను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
70 ఏండ్లలో చేయని అభివృద్ధి 9 ఏండ్లలో చేసి చూపించిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్అని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. 55వ డివిజన్ పరిధి భీమారంలోని డీవీఆర్ గార్డెన్లో కార్పొరేటర్ జక్కుల రజితా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదివారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. బీఆర్ఎస్ 55వ డివిజన్ అధ్యక్షుడు అటికం రవీందర్ అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితాయాదవ్, సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్చార్జి అరూరి విశాల్ హాజరయ్యారు. వారికి మహిళలు కోలాటలు, డప్పు చప్పుళ్లతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ 14 ఏండ్లు అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు డివిజన్, మండల స్థాయిలో ఆత్మీయ స మ్మేళనాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
అభివృద్ధి, సం క్షేమంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న సం క్షేమ పథకాలు, అభివృద్ధిని ఓర్వలేక బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని మం డిపడ్డారు. బీజేపీ చేస్తున్న కుట్రలను బీఆర్ఎస్ నాయకులు ఎప్పటికప్పు డు తిప్పికొట్టాలని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి పక్కరాష్ర్టాల ప్రజలు సీఎం కేసీఆర్ వైపు చూ స్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం సైనికుల్లా పనిచేయాలన్నారు. కార్యకర్తల వెంట వెన్నంటి ఉం టానని, వారి కాళ్లకు ముల్లు దిగితే తన పంటితో తీస్తానని చెప్పారు. మూడోసారి ముచ్చటగా మనదే అధికారమని ఎమ్మెల్యే రమేశ్ జోస్యం చెప్పారు. అనంతరం కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. సమ్మేళనంలో కార్పొరేటర్లు గుగులోత్ దివ్యరాణి, సిరంగి సునీల్, రైతు బంధు సమితి జిల్లా సభ్యులు విక్టర్బాబు, మండల కోఆర్డినేటర్ అంచూరి విజయ్కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్, ఆలయ కమిటీ చైర్మన్ చింతల లక్ష్మణ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి నాయకపు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సుధాకర్, యూత్ అధ్యక్షుడు సాయి, గ్రామ అధ్యక్షుడు సురేశ్, భరత్, గోవర్ధన్ పాల్గొన్నారు.