గ్రామీణ ప్రాంత ప్రజల సౌకర్యార్థమే హెల్త్ సెంటర్ల ఏర్పాటు
గతంలో సర్కారు దవాఖానల్లో అరకొర వసతులు
పేదలకు అందని ద్రాక్షలా వైద్యసేవలు
టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆధునిక వసతులతో మెరుగైన వైద్యం
మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్
పలు గ్రామాల్లో సబ్ హెల్త్ సెంటర్లు ప్రారంభం
నెల్లికుదురు, మే 28: నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సీఎం కేసీఆర్.. వారి ఆరోగ్యమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. శనివారం మండలంలోని ఆలేరు, శ్రీరామగిరి, నైనాల, ఎర్రబెల్లిగూడెం, మేచరాజుపల్లి గ్రామాల్లో ఒక్కొక్కటి రూ.16 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను ఆయా గ్రామ సర్పంచ్, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, జడ్పీటీసీ మేకపోతు శ్రీనివాస్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారని తెలిపారు. సమైక్య పాలనలో సర్కారు వైద్యశాలల్లో అరకొర వసతులతో ప్రజలు తీవ్ర ఇబ్బందు లుపడ్డారని, స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మెరుగై న వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సాధారణ ప్రసవాలు సైతం జరుగుతున్నాయన్నారు. ఆరో గ్య సమస్య తలెత్తినప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లోనే ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు.
భూ ధానం మహాదానం..
పది మందికి ఉపయోగపడేలా చేసిన భూ ధానం మహాదానం వంటిదని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. ఆలేరులో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం నిర్మాణానికి అదే గ్రామానికి చెందిన రూపిరెడ్డి కృష్ణారెడ్డి తన తండ్రి రూపిరెడ్డి ప్రతాప్రెడ్డి జ్ఞాపకార్థం సుమారు 400 గజాల స్థలాన్ని దానం చేశారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కృష్ణారెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం కృష్ణారెడ్డి తల్లిని శాలువాతో సన్మానించారు. అనంతరం నైనాలలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించి పనులను వెంటనే ప్రారంభించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. జామాతండాలో డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించి, కాలనీ చుట్టూ ప్రహారీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు కాలేరు శ్రీవాణి, డొనికెన జ్యోతి, బొమ్మర అశోక్, వేశాల లక్ష్మి, ఎంపీటీసీ బత్తిని అనిల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరుపాటి వెంకట్ రెడ్డి, ప్రధానకార్యదర్శి దర్శనం భిక్షపతి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యాసం రమేశ్, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్ కే వెంకటేశ్వర్రెడ్డి, సొసైటీ చైర్మన్లు జీ వెంకన్న, పీ దేవేందర్రావు, వైస్చైర్మన్ భోజ్యానాయక్, తొర్రూరు ఏఎంసీ వైస్చైర్మన్ విజయ్ యాదవ్, ఉపసర్పంచ్ షరీఫ్, జిల్లావైద్యారోగ్యశాఖ అధికారి హరీశ్రాజ్, మండల వైద్యాధికారి శ్రావణ్కుమార్, నాయకులు రాజిరెడ్డి, వినోద్రెడ్డి, జీ వంశీ, సీహెచ్ శ్రీను, ఆర్ వెంకన్న, ఉపేందర్ పాల్గొన్నారు.
‘మానుకోట’ను అభివృద్ధి చేస్తాం
మహబూబాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జిల్లాలో అభివృద్ధి జరుగుతున్నదని మానుకోట ఎమ్మెల్యే శంకర్నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్ పరిధి 11వ వార్డులోని నిజాం చెరువు వద్ద పట్టణ ప్రగతి నిధులు రూ.30 లక్షలతో చేపట్టనున్న వైంకుంఠధామం నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. నిరుపేదలు మృత్యువాత పడితే అంత్యక్రియలకు ఇబ్బందులు పడకుడా సీఎం కేసీఆర్ వైంకుంఠధామాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. కార్యక్రమంలో వైస్చైర్మన్ ఎండీ ఫరీద్, ఫ్లోర్లీడర్ చిట్యాల జనార్దన్, వార్డు కౌన్సిలర్ బాలూనాయక్, యాళ్ల మురళీధర్రెడ్డి, జీ రాజు, ఎం రఘు, డీ సత్యనారాయణ, కే పద్మ, విజయమ్మ, డీ శంకర్, ఉపేంద్రం, జీ మహేందర్, రఫిక్, రాజ్కుమార్, ఎం రఘు పాల్గొన్నారు.