ప్రతి కార్యకర్త సహకరించి విజయవంతం చేయాలి
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉద్యమకారులతో సమీక్ష
ఖిలావరంగల్, మే 28 : చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకుందామని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ జిల్లా ఏర్పాటైన తర్వాత తొలిసారి జరుగనున్న ఈ వేడుకలకు టీఆర్ఎస్ కార్యకర్తలు పూర్తి సహకారం అందించాలన్నారు. శనివారం మధ్యకోటలోని ఏకశిల పార్క్లో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాకతీయుల కోటలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగేందుకు ప్రతి నాయకుడు కృషి చేయాలన్నారు. అనంతరం ఇటీవల శ్రమ శక్తి అవార్డు పొందిన టీఆర్ఎస్ నాయకుడు బిల్లా శ్రీకాంత్ను ఎమ్మెల్యే సన్మానించారు.
మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానాషమీమ్ మసూద్, 34, 35, 37, 38 డివిజన్ల కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, సోమిశెట్టి ప్రవీణ్, భోగి సువర్ణాసురేశ్, బైరబోయిన ఉమ, పీఏసీఎస్ డైరెక్టర్లు శ్రవణ్, నర్సయ్య, టీఆర్ఎస్ నాయకులు పగడాల సతీశ్, సంగరబోయిన విజయ్, నలిగంటి అభిషేక్, చింతం అమర్, కాసుల ప్రతాప్, సంగరబోయిన చందర్, వనపర్తి కరుణాకర్, మంద అక్షిత్ తదితరులు పాల్గొన్నారు.
ఖుష్మహల్ మైదానాన్ని సందర్శించిన ఆర్డీవో..
రాష్ట్ర అవతరణ వేడుకలకు ముస్తాబవుతున్న ఖుష్మహల్ మైదానాన్ని శనివారం వరంగల్ ఆర్డీవో మహేందర్జీ సందర్శించారు. వేదిక నిర్మాణం, వీఐపీ, ప్రెస్, కళాకారుల గ్యాలరీలు, బారీకేడ్ల ఏర్పాట్లపై సిబ్బందికి సూచనలు చేశారు. జూన్ 1వ తేదీ వరకు పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఖిలావరంగల్ తహసీల్దార్ ఫణికుమార్ ఉన్నారు.