హనుమకొండ చౌరస్తా, మే 10 : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తేజస్వీ విద్యాసంస్థలు విజయ పరంపరను కొనసాగిస్తూ విజయకేతనం ఎగురవేశాయి. ఈ విజయంలో ఉపాధ్యాయల శ్రమ, విద్యార్థుల సృజనాత్మకత, తల్లిదండ్రుల ప్రోత్సాహం, యాజమాన్యం కృషి ఎంతైనా ఉందని చైర్మన్ రేవూరి జెన్నారెడ్డి తెలిపారు. బుధవారం ప్రకటించిన పరీక్ష ఫలితాల్లో 104 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించినట్లు పేర్కొన్నారు.
అలాగే 83 మంది విద్యార్థులు 9.8 జీపీఏ, 53 మంది విద్యార్థులు 9.7 జీపీఏ, 49 మంది విద్యార్థులు 9.5 జీపీఏ, 39 మంది విద్యార్థులు 9.3 జీపీఏ, 33 మంది విద్యార్థులు 9.2 జీపీఏ, 15 మంది విద్యార్థులు 9.0 జీపీఏ సాధించారని వివరించారు. ఈ విజయానికి ముఖ్య కారకులైన విద్యార్థులు, తల్లిదండ్రులు, కీలకపాత్ర వహించిన బోధన, బోధనేతర సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.