టేకుమట్ల, అక్టోబర్ 12 : టేకుమట్ల మండలం వెల్లంపల్లికి చెందిన సినీగేయ రచయిత మిట్టపల్లి సురేందర్కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హాజరయ్యే ఎన్నికల ప్రచార సభల్లో పాటలు పాడే బాధ్యతలను మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో అప్పగించినట్లు మిట్టపల్లి మిత్రమండలి సభ్యులు అందె కుమార్, సతీశ్, పాల శంకర్ తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎన్నికలు అయిపోయే వరకు మిట్టపల్లి తన కళాబృందంతో ఆట, పాటలతో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే గండ్రకు మిట్టపల్లి ధన్యవాదాలు తెలిపారు.