భూపాలపల్లి టౌన్/ములుగు టౌన్, డిసెంబర్ 6 : గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, పాడి తర్వాత స్థానం పెరటి కోళ్లదే. రానురాను వాటి పెంపకం తగ్గిపోతున్నది. ఈ క్రమంలో ప్రభుత్వం నాటుకోళ్ల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తోంది. పేద, మధ్య తరగతి వారికి సబ్సిడీపై కోడి పిల్లలను పంపిణీ చేస్తున్నది. మూడు లేదా నాలుగు వారాల వయసు ఉన్న పిల్లలను ఇవ్వనుంది. ఒక్కో యూనిట్ రూ.1,850 కాగా, లబ్ధిదారుడు రూ.600 చెల్లిస్తే, సర్కారు రూ. 1250 భరిస్తుంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాకు 175 చొప్పున పెరటి కోళ్ల యూనిట్లను కేటాయించింది. ఈ నెల 10 లోపు గ్రామ సభ తీర్మానంతోపాటు జిల్లా పశు వైద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తు అందించాల్సి ఉంటుంది.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కోళ్ల పెంపకం ప్రధాన ఆదాయంగా ఉండేది. రానురానూ నాటుకోళ్లు కనుమరుగై బాయిలర్ కోళ్లు అందుబాటులోకి వచ్చాయి. పెరటి కోళ్ల మాంసం తింటే మంచి పౌష్టికాహా రం లభిస్తుంది. దేశవాళీ కోళ్ల పెంపకం ద్వారా మంచి ఆర్థిక పరిపుష్టి పొందవచ్చు. ఉత్పత్తి సామర్థ్యం ఎక్కువగా ఉండే కోళ్లను ఇంటి పరిసరాల్లో పెంచుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో పెరటి కోళ్లను ఇంటి పరిసరాల్లో పెంచి లాభాలు గడించవచ్చు. ఇందుకు సర్కారు సైతం ప్రోత్సాహాన్నిస్తోంది.
ప్రభుత్వ సబ్సిడీ రూ.1250
ఒక్కో యూనిట్లో 25 కోడి పిల్లలు ఉండగా, దీనికి రూ.1,850. లబ్ధిదారుడు రూ.600 చెల్లిస్తే చాలు. ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.1250 భరిస్తుంది. ఒక్కో యూనిట్ కింద పెంపకందారుడికి మూడు లేదా నాలుగు వారాల వయసు ఉన్న కోడి పిల్లలను ఇవ్వనుంది. ఇవి పెరిగి పెద్దయ్యాక ఒక్కో కోడి జీవి త కాలంలో సరాసరి 160 నుంచి 200 వరకు గుడ్లు పెట్టే అవకాశం ఉం ది. బాయిలర్ కోళ్ల కన్నా నాటుకోడి మాంసం రుచిగా ఉండడంతో పాటు పోషక విలువలు సైతం ఎక్కువగా ఉంటాయి. ఈ కోడిగుడ్లను తినడం ద్వారా చిన్నారుల్లో దృష్టి లోపం దూ రమవుతుందని, అధిక కొవ్వును కలిగిస్తుందని వైద్యులు చెబు తున్నారు. పెరటి కోళ్ల పెంపకానికి ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ ద్వారా ప్రోత్సాహకాలను అందిస్తోంది.
10లోగా దరఖాస్తు చేసుకోవాలి
పెరటి కోళ్ల కోసం ఆసక్తి గల వారు ఈ నెల 10 లోగా పశువైద్యాధికారి వద్ద దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటి వరకు 66 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. జిల్లాకు 175 యూనిట్లు వచ్చాయి. పెరటి కోళ్ల పెంపకంతో లబ్ధిదారుడు మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలి.
– సదానందం, జిల్లా పశువైద్యాధికారి, భూపాలపల్లి
రూ. 600 డీడీ తీయాలి
ఆసక్తి గల అభ్యర్థులు రూ. 600 డీడీని జిల్లా పశువైద్యాధికారి పేరున తీయాలి. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సభ తీర్మానం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రాతిపపాదికన ఎంపిక చేస్తారు. రైతులు బ్యాంకులో తీసిన డీడీ, గ్రామ సభ తీర్మానం దరఖాస్తుకు జత చేసి జిల్లా పశువైద్యాధికారి కార్యాయంలో సమర్పించాలి. పశువైద్యాధికారి దరఖాస్తులను జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి కార్యాలయంలో అందజేస్తారు. దరఖాస్తులు స్వీకరించిన రెండు నెలల లోపు అధికారులు లబ్ధిదారుడికి పెరటి కోడి పిల్లలను అంద జేస్తారు. పిల్లలు ఆరు నెలల్లో అమ్మకానికి వస్తాయి.
ఒక్కో జిల్లాకు 175 యూనిట్లు మంజూరు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ప్రభుత్వం 175 పెరటి కోళ్ల యూనిట్లను కేటాయించింది. ఇప్పటి 66 మంది దరఖాస్తులు చేసుకున్నారు. రేగొండ-7, మహాముత్తారం-35, చల్లగరిగ-2, చెల్పూర్-12, మొగుళ్లపల్లి-10 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో 17 పశు వైద్యశాలలు ఉండగా ప్రతి పశువైద్యశాల పరిధిలో 10 యూనిట్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ములుగు జిల్లాకూ సర్కారు 175 యూని ట్లు మంజూరు చేయగా, ఒక్కో మండలానికి 19 యూనిట్లు రానున్నాయని అధికారులు చెబుతున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం రాయితీపై అందించే ఈ అవకాశాన్ని పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెల 10 లోపు గ్రామ సభ తీర్మానంతో పాటు జిల్లా పశు వైద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తు అందించాలి.
– విజయ్భాస్కర్, జిల్లా పశువైద్య అధికారి, ములుగు