హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం, పోలీ స్ శాఖ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చే సిన యంగ్ ఇండియా పోలీస్ సూ ల్(వైఐపీఎస్) దేశానికే ఆదర్శ విద్యాసంస్థగా ఎదగాలని డీజీపీ సీవీ ఆనం ద్ ఆకాంక్షించారు. మంచిరేవులలో నిర్మాణంలో ఉన్న పాఠశాల పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరారు.
మంగళవారం నిర్వహించిన సూల్ సొసైటీ కమిటీ స మావేశంలో ఐపీఎస్ అధికారుల సతీమణుల సంఘం అధ్యక్షురాలు లలి తా ఆనంద్, కమిటీ సభ్యులతో కలిసి నిర్మాణ పురోగతి, విద్యా ప్రణాళిక లు, మౌలిక సదుపాయాలను సమీక్షించారు. పోలీసు పిల్లల కోసం ఏ ర్పాటు చేస్తున్న ఈ పాఠశాల అభివృద్ధికి ఐపీఎస్ఓడబ్ల్యూఏ కూడా తమ వంతు సహకారం అందించాలని ని ర్ణయించింది. సమావేశంలో లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్ భగవత్, ఆక్టోపస్ డీజీ అనిల్ కుమార్, ఐజీ గజారావు భూపాల్, సైబరాబాద్ సీపీ రమేశ్ పాల్గొన్నారు.