హనుమకొండ, మే 17 : టీజీ ఎప్సెట్-2026 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థలు ప్రభంజనం సృష్టించాయి. ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థి వీ సాహ్యు బీపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 14వ ర్యాంకు సాధించినట్లు విద్యా సంస్థల చైర్మన్ ఏ వరదారెడ్డి తెలిపారు. అలాగే, బీపీసీ విభాగంలో కే జీవన్కుమార్ 91వ ర్యాంకు, కే అశ్రిత 262, ఆర్ శ్రీవాణి 298, జీ యువన్చంద్ర 299 ర్యాంకు సాధించినట్లు తెలిపారు.
వీరితో పాటు జే శ్వేత 351, జే గురుమోహన్ చరణ్ 369, ఎన్ అవినాశ్ 408, ఎన్ శివ కల్యాణి 413, పీ సంజన 414, వై సాత్విక్ 476, ఆర్ నిరూప్ రెడ్డి 515, కే జాహ్నవి 610, సీహెచ్ అర్నవ్ 628, కే ధీరజ్ 654 ర్యాంకు సాధించినట్లు వివరించారు. ప్రస్తుతం విద్యావ్యవస్థలో వస్తున్న మార్పులను గమనిస్తూ వాటికి అనుగుణంగా విద్యార్థులకు చకటి సృజనాత్మకతతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. భవిష్యత్లో మరింత అత్యుత్తమైన ర్యాంకులు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని చైర్మన్ వరదారెడ్డి, మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం జేఈఈ మేయిన్స్ 2026లో కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపారు.