ఖిలావరంగల్, మార్చి 29: ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాని వరంగల్ జిల్లా కలెక్టర్ బీ గోపి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టాటా కన్సల్టెన్సీ రూపొందించిన యాప్ను అధికారులు వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో చేపటే అభివృద్ధి పనులను ఆ యాప్ల అప్లోడ్ చేసి పరిపాలనా అనుమతులు తీసుకోవాలని చెప్పారు. ఈ వారం ప్రతి మండలంలో కనీసం రెండు పాఠశాలల్లో అయినా పనులు ప్రారంభించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే యాప్ ఎలా ఉపయోగించాలో టెక్నికల్ సిబ్బంది ఇంజినీరింగ్ అధికారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కోట శ్రీవత్స, డీఈఓ వాసంతి, మండల స్పెషల్ అధికారులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా టీఎన్జీవోస్ డైరీని కలెక్టర్ బీ గోపి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ను టీఎన్జీవోస్ కార్యవర్గం ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గజ్జెల రాంకిషన్, ప్రధాన కార్యదర్శి గాజే వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సదానందం, హేమానాయక్, గద్దల రాజు, త్రివేణి, రాజు, రమేష్, చందర్, రవికుమార్, భాస్కర్, అశోక్, సలీం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.