తీవ్రమైన తాగునీటి ఎద్దడి నుంచి గట్టెక్కించి నేడు కేసీఆర్ సర్కారు మారుమూల పల్లెకూ స్వచ్ఛమైన జలాలను సరఫరా చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం ఊరూరా మంచినీళ్ల దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా అంతటా పండుగలా జరుపుకొన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మిషన్ భగీరథ ప్రాజెక్టులు, తాగునీటి ట్యాంకులను మామిడితోరణాలు, పూలతో అలంకరించి ముగ్గులు వేయగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఉత్సాహంగా సంబురాల్లో పాల్గొన్నారు. అనంతరం ‘మిషన్ భగీరథ’ నీటిపై గ్రామాల్లో అవగాహన ర్యాలీలు తీయడంతో పాటు పంపు ఆపరేటర్లు, జీపీ, వాటర్గ్రిడ్ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. మరిపెడ మండలం ఎదళ్లగుట్ట(పాలేరు-వరంగల్ సెగ్మెంట్) ప్రాజెక్ట్ వద్ద ఉత్సవాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్.. మిగతా చోట్ల ఎమ్మెల్యేలు, కలెక్టర్లు పాల్గొన్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 18
మిషన్ భగీరథ ప్రాజెక్టుతో ఇంటింటికీ నల్లాల ద్వారా సరఫరా అవుతున్న ‘శుద్ధనీరు’ అమృతంగా మారింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ‘మంచి నీళ్ల పండుగ’ను ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాగు నీటి ట్యాంకుల వద్ద ముగ్గులు వేసి, మామిడి తోరణాలు కట్టి ముస్తాబు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గ్రామాల్లో భారీగా ర్యాలీలు నిర్వహించారు. మిషన్ భగీరథ నీటిపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పుంపు ఆపరేటర్లు, గ్రామ పంచాయతీ, మిషన్ భగీరథ సిబ్బందిని సన్మానించారు. మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామం ఎదళగుట్ట మిషన్ భగీరథ(పాలేరు-వరంగల్ సెగ్మెంట్) ప్రాజెక్ట్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, బానోత్ శంకర్నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ శశాంక హాజరయ్యారు.
తొలుత భగీరథ ప్రాజెక్ట్ వద్ద వివిధ దశల్లో శుద్ధి అవుతున్న తీరును వారు పరిశీలించారు. గణపురం మండలం గాంధీనగర్లోని మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు వద్ద భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్ పర్సన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, కలెక్టర్ భవేశ్మిశ్రా ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మంచినీటి దినోత్సవాన్ని ప్రారంభించారు. దామెర మండలం సింగరాజుపల్లిలోని మిషన్భగీరథ ఫిల్టర్బెడ్లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఆర్డీసీ) చైర్మన్ మెట్టు శ్రీనివాస్ పాల్గొని నీటి శుద్ధీకరణను పరిశీలించారు. ధర్మసాగర్లోని వాటర్గ్రిడ్ వద్ద నీటి శుద్ధి చేసే తీరును ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, జిల్లా పరిషత్ ఛైర్మన్ మారపెల్లి ప్రవీణ్కుమార్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నల్లబెల్లిలోనూ నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి హాజరయ్యారు. ఏటూరునాగారం మండలంలోని రొయ్యూరు మిషన్ భగీరథ తాగునీటి శుద్ధీకరణ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి పాల్గొన్నారు.
– నమస్తే నెట్వర్క్, జూన్ 18