హనుమకొండసబర్బన్, డిసెంబర్27: గత ప్రభుత్వాల హయాంలో నిధులు, నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకు న్న పాఠశాలలకు బాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి పథకాన్ని తెచ్చింది. దీని ద్వారా విద్యా ర్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరచడం లక్ష్యం గా పెట్టుకున్నది. ఇందులో భాగంగా పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం కూడా కల్పిస్తున్నది. అయితే గతంలో మాదిరిగా సాధారణ విద్యుత్ కనెక్షన్లు ఇస్తే ప్రతి నెలా కరంట్ బిల్లులు చెల్లించడం స్కూళ్లకు భారంగా మారుతుంది. ఇందుకు పా ఠశాలల్లో ప్రభుత్వ నిధులతోనే సోలార్ విద్యుత్ను ఏర్పా టు చేయాలని నిర్ణయించింది. దీని కోసం మొదటి విడతగా రాష్ట్రంలో 1580 పాఠశాలలను ఎంపిక చేయగా, వరంగల్ ఉమ్మడి జిల్లాలో 132 పాఠశాలలు ఉన్నాయి. వీటి నిర్మాణ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర పునరుద్ధనీయ ఇంధన వన రుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్(టీఎస్రెడ్కో)కు అప్పగిం చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే రంగంలోకి దిగిన ఈ సంస్థ సిబ్బంది ఆయా పాఠశాలల్లో సర్వే చేపట్టా రు. ఇప్పటికే 88 స్కూళ్లలో సర్వే ప్రక్రియ పూర్తయింది. మరో వారం రోజుల్లో అన్ని పాఠశాలల్లో సర్వేను పూర్తి చేసి విద్యుత్ పలకల ఏర్పాటు పనులను మొదలు పెట్టనున్నా రు. హనుమకొండ జిల్లాలో 2, వరంగల్ జిల్లాలో 4 మొత్తం 6 స్కూళ్లల్లో ఎల్లుండి నుంచే పరికరాలు అమర్చే పనులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ సోలార్ పవర్కు ఒక్కో యూనిట్కు రూ. లక్షా 59 వేల 600 వెచ్చిస్తారు. మొత్తంగా చూస్తే రూ.2.9 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ సోలార్ పవర్తో రెండు కిలో వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్న 2 కిలోవాట్ల సోలార్ విద్యుత్ వల్ల నిత్యం 8 యూనిట్ల కరంట్ ఉత్పత్తి అవుతుం ది. పాఠశాల అవసరాలకు పోను మిగతా విద్యుత్ను పవర్ గ్రిడ్కు అనుసంధానిస్తారు. ఈ మిగిలిన విద్యుత్ లెక్కలను కూబి ప్రతి నెల లెక్కిస్తారు. గ్రిడ్కు వెళ్లే విద్యుత్కు సంబం ధించి ప్రతి ఆరు నెలలకు యూనిట్కు రూ.4.25 పైసల చొప్పున లెక్కగట్టి పాఠశాలకు చెల్లిస్తారు. దీని ద్వారాఆ ఆయా స్కూళ్లలో స్ట్టేషనరీ తదితర అవసరాలు కూడా తీరు తాయి. దీని కోసం నెట్ మీటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. సోలార్ స్టడీ ల్యాంప్స్ పేరిట నిర్మిస్తున్న విద్యుత్ వ్యవస్థ వరంగల్ జిల్లాలో 35, హనుమకొండ జిల్లాలో23, జనగామ జిల్లాలో 23, జయశంకర్ బూపాలపల్లి జిల్లాలో 10, మహబూబాబాద్ జిల్లాలో 35 ములుగు జిల్లాలో 6 స్కూళ్లలో మొదటి విడుతలో ఏర్పాటు చేస్తారు. గతంలో రూర్బన్ కార్యక్రమంలో భాగంగా 15 స్కూళ్లలో ఈ సోలా ర్ పవర్ యూనిట్లను అమర్చగా అవి విజయవంతంగా నడుస్తున్నాయి. దీంతో అన్ని స్కూళ్లలో పలు విడుతలుగా అమలు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లా పరిధిలోని 132 స్కూళ్లలో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే పాఠశాలల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. సర్వే పనులు సైతం చివరి దశలో ఉన్నా యి. మరో వారం రోజుల్లో సర్వే పూర్తయి, సోలార్ పరికరాల బిగింపు ప్రక్రియ మొదలవుతుంది. ఒక వేళ మేం బిగిస్తున్న రెండు కిలోవాట్ల విద్యుత్ సరిపోకపోతే ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయిడి ప్రపోజల్తో సామర్థ్యం కూడా పెంచుతాం.
– జీ మహేందర్ రెడ్డి, టీఎస్ రెడ్కో, జిల్లా మేనేజర్
పాఠశాలల్లో విద్యుత్ సరఫరా ప్రధాన సమస్యగా ఉండేది. బిల్లు కట్టడానికి అనేక ఇబ్బందులు ఎదుర య్యేవి. రాష్ట్ర వచ్చిన తర్వాత కొంత మేరకు వెసులు బాటు కూడా లభించింది. పాఠశాలల్లో ఏర్పాటు చేయ నున్న సోలార్ విద్యుత్ వల్ల చాలా ఉపయోగం ఉంది. ఇప్పుడు డిజిటల్ కాలం నడుస్తుంది. ఈ తరుణంలో విద్యార్థులకు బోధనన కూడా అత్యంత నాణ్యంగ అందించడం వీలవుతుంది.
– ఆదినారాయణ, ఉపాధ్యాయుడు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సుబేదారి