భూపాలపల్లి, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి.. కారుణ్య నియామకాల ద్వారా కొందరు యువకులు సింగరేణి ఉద్యోగాల్లో చేరుతున్నా రు. బొగ్గుబాయి పని కష్టమే అయినప్పటికీ, ఉద్యోగ భ ద్రతే ముఖ్యమని భావించి, కదిలి వస్తున్నారు. సింగరే ణిలో ఉద్యోగాలు అదృష్టంగా తలచి, విధుల్లో చేరుతు న్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత చొరవతో తమకు ఉద్యోగాలు లభించాయని ఆనందంగా చెబుతున్నారు.
సాఫ్ట్వేర్ టు సింగరేణి
కరోనాతో పలు రంగాలు అతలాకుతలమై పోయాయి. సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఉద్యోగుల కుదింపు పెద్ద సంఖ్య లో జరిగింది. మంచి వేతనం వస్తున్నప్పటికీ సాఫ్ట్వేర్ ఉ ద్యోగం ఎప్పుడు ఊడుతుందోననే భయం యువతను వెంటాడుతూనే ఉంటుంది. ఈ తరుణంలో సమైక్య రా ష్ట్రంలో ఆగిపోయిన తండ్రీకొడుకుల ఉద్యోగాలను సీఎం కేసీఆర్ అత్యంత చొరవ చూపి సింగరేణిలో అమల్లోకి తీసుకొచ్చారు. కారుణ్య నియామక ప్రక్రియ కార్మిక వారసులకు కల్పతరువుగా మారింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు కూడా వెనుతిరిగి వచ్చారు. తమ తండ్రి అనారోగ్యంతో మెడికల్ అన్ఫిట్ అయిన సందర్భంలో సింగరేణిలో విధుల్లో చేరుతున్నారు. భూగర్భ గనుల్లో విధులు బరువైన పని అయినప్పటికీ ఉద్యోగ భద్రత కారణంగా సింగరేణిలో విధుల్లో చేరుతున్నారు. స్థానికంగానే ఉండే అవకాశం, మంచి వసతులు, తల్లిదండ్రులు, కుటుంబం వెంట ఉంచుకునే వీలుండడంతో ఇటు వైపు మొగ్గు చూపు తున్నారు. ఇలా పెద్ద సంఖ్యలో యువతీయువకులు సింగ రేణిలో చేరి సంస్థ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు.
బాగోగులు చూసుకుంటున్న ..
కారుణ్య నియామకం ద్వారా సింగరేణిలో ఉద్యోగం రావడం చా లా సంతోషంగా ఉంది. దీంతో మా అ మ్మానాన్నల బాగోగులు దగ్గరుండి చూ సుకునే అవకాశం కలిగింది. అంతకు ముం దు ఐటీ కంపెనీలో నెట్వర్క్ ఇంజినీరుగా పనిచే శా. తదనంతరం జియో ఇన్ఫోకం లిమిటెడ్లో బ్యాక్హాల్ ఇంజినీరు గా పనిచేస్తున్న క్రమంలోనే కారుణ్య నియామకం కింద మా తండ్రి మాటేటి ప్రభాకర్ ఉద్యోగం నాకు వచ్చింది. జియోలో రోజుకు 12 నుంచి 14 గంటలు పనిచేసేవాడిని. సింగరేణిలో 8 గంటల పనే ఉం టుంది. నాకు 2022 మార్చి నెలలో ఇక్కడ ఉద్యోగం వచ్చింది కేసీఆర్ సర్కు కృతజ్ఞతలు. నా తోటి యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్న. సింగరే ణి ఉద్యోగం అంటే భయపడాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. చేసే పని నిబద్ధతతో చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఉద్యోగంలో చేరేముందు నన్ను చాలా మంది భయపెట్టారు. ఇప్పుడు నాకేమాత్రం భయం లే దు. మా నాన్న ఇదే గనిలో పనిచేస్తున్న క్రమంలో మెడికల్ అన్ఫిట్ అయ్యారు.
– మాటేటి రంజిత్సాగర్, బదిలీ వర్కర్, కేటీకే 5వ గని
స్టార్టప్ జాబ్ వదిలి వచ్చా..
సింగరేణిలో చేరకముందు స్టార్టప్ కంపెనీలో పనిచేశా. అక్కడ కూడా మంచి జీతమే ఉండే. మా నాన్న కూచన మల్లయ్య ఇదే గనిలో ట్రామర్గా పనిచేస్తు న్న క్రమంలో అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో మెడికల్ అన్ఫిట్ చేశారు. ఆ ఉద్యోగాన్ని 2021 నవంబర్లో కారుణ్య నియామకం కింద నాకు ఇచ్చారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితక్క చొరవ వల్లే కారుణ్య నియామకాలు సిం గరేణిలో అమలవుతున్నాయి. ఇప్పుడు సింగరేణిలో 40 శాతం మంది యువతే. ఇక్కడ అంతర్గత పరీక్షలు రాసి ఉన్నతోద్యోగం పొందే అవకాశం కూడా ఉంది. ఇతర కంపెనీలను చూసుకుంటే సింగరేణిలోనే అనేక వసతులు, అలవెన్స్లు ఉన్నాయి. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగులను తీసివేస్తున్న సందర్భంలో సింగరేణి సంస్థ ఎందరో యువతకు అవకాశం ఇచ్చింది. ఇది కేవలం సీఎం కేసీఆర్ వల్లే. నా వంతుగా సింగరేణి పురోభివృద్ధికి కృషి చేస్తా.
– కూచన నరేశ్, బదిలీ వర్కర్, కేటీకే 5వ గని