ఐనవోలు ఏప్రిల్ 27 : మండలంలోని ఒంటిమామిడిపల్లి జడ్పీ పాఠశాల ‘పీఎం శ్రీ’(పీఎం స్కూల్ రైజింగ్ ఇండియా) పథకానికి ఎంపికైన్నట్లు ఎస్ఎంసీ చైర్మన్ పొన్నల రాజు గురువారం తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టి ‘పీఎం శ్రీ’ పథకంలో భాగంగా దేశ వ్యా ప్తంగా 14500 పాఠశాలల్లో ఒంటిమామిడిపల్లి ఎంపిక కావడంతో సంతోషంగా ఉందన్నారు.
పాఠశాలను అభివృద్ధి పథంలో ముందు నడిపించేందుకు సహకరించిన ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని పాఠశాలను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు.