బచ్చన్నపేట. సెప్టెంబర్ 12 : సిపిఎం అఖిలభారత మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి పుట్టినప్పటినుంచి చనిపోయేంతవరకు నిబద్ధతగల కమ్యూనిస్టుగా ప్రజల కోసం పనిచేశారని సిపిఎం నాయకుడు రవీందర్ రెడ్డి అన్నారు. ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా జనగామ జిల్లా బచ్చన్నపేటమండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పార్టీ పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీతారాం ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లే విధంగా ప్రజా పోరాటాలు నిర్వహించాలన్నారు. అదే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రామగల అశోక్, కంత్రి, ఐలయ్య, గంగరబోయిన సమ్మయ్య, బోదాసు సుధాకర్, బుర్రి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.