శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నాలుగవ రోజైన బుధవారం ఆయాచోట్ల వివిధ అలంకారాల్లో దర్శనమివ్వగా భక్తులు విశేష పూజలు గావించారు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు.
అలాగే హనుమకొండలోని హనుమద్గిరి పద్మాక్షి ఆలయంలో అమ్మవారు కూష్మాండ అలంకారంలో, కాళేశ్వర ముక్తీశ్వరాలయంలో అమ్మవారు కూష్మాండ అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలిచి నైవేద్యాలు సమర్పించారు.