గోవిందరావుపేట/వాజేడు/నర్సంపేట రూరల్, డిసెంబర్ 18 : ములుగు, వరంగల్ జిల్లాలను పొగ మంచు కమ్మేసింది. ములుగు జిల్లాలోని 163 జాతీయ రహదారిపై, లక్నవరం సరస్సు వద్ద, వాజేడు, నర్సంపేట మండలాల్లో ఉదయం 8 గంటల వరకు దాని ప్రభావం కనిపించింది.
వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధాన రహదారులతో పాటు పచ్చని పంట పొలాలు,చెరువు, సరస్సుల చుట్టూ కమ్ముకున్న మంచుతెరల అందాలు చూపరులను ఆకట్టుకున్నాయి.