వరంగల్ : ఫుడ్ పాయిజన్తో వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను వరంగల్ సీనియర్ సివిల్ జడ్జి ఉపేందర్ పరామర్శించారు. సోమవారం రాత్రి బల్లిపడిన భోజనం తిన్న వర్ధన్నపేటలోని ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల్లో పలువురు అస్వస్థతకు గురయ్యారు.
వీరిలో 13 మందిని అధికారులు రాత్రి ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, జిల్లా కలెక్టర్ గోపి, అదనపు కలెక్టర్ హరి సింగ్, శ్రీవత్స తదితరులు ఎంజీఎంను సందర్శించి చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు.
విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల ద్వారా ఆరా తీశారు. ఫుడ్ పాయిజన్ కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థినుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.