గీసుగొండ, డిసెంబర్ 26 : కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు, జాతరను కనుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాలు, జాతర వాల్ పోస్టర్లను సోమవారం హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో ఆలయాలకు పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
జాతరలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉత్సవ కమిటీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వీరగోని రాజ్కుమార్, సర్పంచ్ దౌడు బాబు, యూత్ అధ్యక్షుడు సిరీస్ శ్రీకాంత్, దళిత బంధు సమితి మండల కో ఆర్డినేటర్ కోట ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.