ఆత్మకూరు, ఫిబ్రవరి 23 : అగ్రంపహాడ్లో సమ్మక్క-సారలమ్మ దేవతలు గద్దెలపై కొలువు దీరారు. భక్తులు శుక్రవారం తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. తమ పిల్లాపాపలు సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నారు. కార్యక్రమంలో డీసీపీ రవీందర్, ఆర్డీవో శ్రీనివాస్, ఏసీపీ కిశోర్కుమార్, తహసీల్దార్ జగన్మోహన్రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, సీఐలు సంతోష్, రవిరాజు, ఎండోమెంట్ అధికారి శేషగిరి, జాతర చైర్మన్ శీలం రమేశ్ పాల్గొన్నారు.
తల్లులను దర్శించుకున్న ఎమ్మెల్యే రేవూరి అగ్రంపహాడ్ సమ్మక్క-సారలమ్మ తల్లులను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి దంపతులు దర్శించుకుని మొక్కులను చెల్లించారు.మండలాధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు.
మొక్కులు చెల్లించిన జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ భీమదేవరపల్లి: గిరిజనుల ఆరాధ్య దైవాలు సమ్మక్క-సారలమ్మ జాతర భక్తజనంతో కిక్కిరిసిపోయింది. ములుకనూరు, కొత్తకొండ జాతరకు శుక్రవారం భక్తజనం పోటెత్తింది. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. ఎదురుకోళ్లతో మొక్కులు చెల్లించుకున్నారు. జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్కుమార్, ఎంపీపీ జక్కుల అనిత, జడ్పీటీసీ వంగ రవి వనదేవతలను దర్శించుకున్నారు. చైర్మన్లు మాడుగుల వీరస్వామి, వూదరి రవీందర్, సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సైలు నండ్రు సాయిబాబు, నీలోజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
అమ్మవారిపేటలో భక్తుల సందడి మడికొండ: గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్ అమ్మవారిపేటలో సమ్మక్క-సారలమ్మ జాతర కొనసాగుతున్నది. వనదేవతలు గద్దెలపై కొలువై ఉండడంతో శుక్రవారం భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో జాతర పరిసరాలు కోలాహలంగా మారాయి. బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్, బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్రావు, కార్పొరేటర్ జలగం అనిత వన దేవతలను దర్శించుకున్నారు.